AP: ఏపీలో గంజాయి మత్తులో కిడ్నాప్ కలకలం.. మూడు గంటల పాటు బట్టలు ఊడదీసి..!

శ్రీకాకుళం జిల్లా రాజాంలో గంజాయి మత్తులో జరిగిన కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. పాత కక్షల కారణంగా గౌతమ్ అనే యువకుడిని నవీన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. దాదాపు మూడు గంటల పాటు గౌతమ్ బట్టలు ఊడదీసి చావబాదారు. రంగంలోకి దిగిన పోలీసులు నవీన్ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

AP: ఏపీలో గంజాయి మత్తులో కిడ్నాప్ కలకలం.. మూడు గంటల పాటు బట్టలు ఊడదీసి..!
New Update

Srikakulam: శ్రీకాకుళం జిల్లా రాజాంలో గంజాయి మత్తులో కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఓ శుభ కార్యక్రమానికి రాజాం వచ్చిన గౌతమ్ అనే యువకుడిని నవీన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. గొల్లవీధి - డోలపేట యువకుల మధ్య ఉన్న పాత కక్షలు మళ్లీ పడగవిప్పాయి. గొల్లవీది యువకులపై నవీన్ గ్యాంగ్ కక్ష కట్టింది. అయితే, ఆ గ్యాంగ్ కు శ్రీకాకుళంకు చెందిన గౌతమ్ పట్టిబడ్డాడు. దాదాపు మూడు గంటల పాటు బట్టలు ఊడదీసి నవీన్ గ్యాంగ్ చావ బాదింది.

Also Read: అట్టుడుకుతున్న ఆళ్లగడ్డ.. అఖిలప్రియ ఫాలోవర్ శ్రీదేవి హత్యలో ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్.?

గౌతమ్ ను కొట్టిన ఫొటోలను నవీన్ గ్యాంగ్.. గొల్లవీధి యువకులకు పోస్ట్ చేసింది. అలర్ట్ అయిన గొల్లవీధి యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, గురవాం తోటలో అపస్మారక స్థితిలో ఉన్న గౌతమ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసుల రాకను గమనించి నవీన్ గ్యాంగ్ అప్పటికే పరారైంది.

Also Read: అధికారులకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్..!

మొత్తం ఎనిమిది మంది ఈ కిడ్నప్ లో భాగస్వామ్యం అయినట్లు సమాచారం. వారి కేసం మూడు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం ప్రాణాపాయం స్థితిలో ఉన్న గౌతమ్ రాజాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

#srikakulam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి