హమీర్పూర్కు చెందిన రాజేశ్ కుమార్ షిండే(30) మహోబా హెడ్ క్వార్టర్స్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో అగ్రి రీజినల్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జూన్ 19వ తేదీన ఉదయం 11.45 గంటల సమయంలో ల్యాప్టాప్లో వర్క్ చేస్తుండగా, అలసటకు గురయ్యాడు. ఉన్నట్టుండి ఛాతీ వద్ద చేతి పెట్టుకుని అలానే కుర్చీలోనే క్షణాల్లో ఒరిగిపోయాడు. తోటి ఉద్యోగులు అప్రమత్తమయ్యే లోపు రాజేశ్ ప్రాణాలొదిలాడు.
పూర్తిగా చదవండి..డ్యూటీలోనే హార్ట్ ఎటాక్ తో మరణించిన బ్యాంక్ మేనేజర్!
ఉత్తరప్రదేశ్ మహోబా జిల్లాలోని HDFC బ్యాంక్ మేనేజర్ డ్యూటీలోనే గుండెపోటుతో మరణించిన ఘటన వెలుగులోకి వచ్చింది. జూన్ 19వ తేదీన ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న ఆయన ఛాతీలో నొప్పి రావటంతో కుర్చీలోనే ఒరిగిపోయాడు. తోటి ఉద్యోగులు అప్రమత్తమయ్యి సీపీఆర్ చేసిన ప్రాణాలు కాపడలేకపోయారు.
Translate this News: