ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఫ్యాన్స్

ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన బర్త్ డే సెలెబ్రేషన్స్ లో గొడవ పడ్డారు. భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్ సాహూ, వాసు అనే రెండు వర్గాలుగా విడిపోయి నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. దాడుల్లో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. నిన్న రాత్రి ఈ గొడవ జరిగింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. దీంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలియజేస్తున్నారు. కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ పుట్టిన రోజును ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ చోట ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన బర్త్ డే సెలెబ్రేషన్స్ లో గొడవ పడ్డారు. రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే..

రెండు వర్గాలుగా విడిపోయి..

భీమవరంలో ప్రభాస్ కు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రతీ ఏటా అక్కడ డార్లింగ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరుగుతాయి. ఈ ఏడాది కూడా ఫ్యాన్స్ అలానే ప్లాన్ చేశారు.ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య గొడవైంది. భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్ సాహూ - వాసు అనే రెండు వర్గాలుగా విడిపోయి నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. దాడుల్లో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. నిన్న రాత్రి ఈ గొడవ జరిగింది.

Also Read : రజినీకాంత్ సినిమాలో ధనుష్.. డైరెక్టర్ ఎవరంటే?

ప్రభాస్ బర్త్‌ డే రోజు ప్రసన్న సాహు వర్గం భీమవరంలో భారీ వేడుక ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో సాహో వర్గం ఫేక్‌ ఫ్యాన్స్‌ అంటూ జిల్లా ప్రభాస్‌ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ వాసు కామెంట్స్‌ చేశారు. దీంతో వాసు వర్గం.. సాహో వర్గంపై దాడికి దిగింది. మార్కెట్ యార్డులో నిర్వహించే వాసు వేడుకలను అడ్డుకునేందుకు సాహు వర్గం ప్రయత్నించింది. ఈ క్రమంలోనే జబర్దస్త్ ఈవెంట్ ఆర్గనైజర్ ప్రకాష్ పై వాసువర్గం దాడికి దిగినట్లు తెలుస్తోంది.

Also Read: యాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం: ఈవో

 

Advertisment
Advertisment
తాజా కథనాలు