Breaking: హైదరాబాద్ లో పెను విషాదం.. స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి!

హైదరాబాద్‌ సికింద్రాబాద్‌ జవహర్‌ నగర్ పీఎస్‌ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. తన అన్నని స్కూల్‌ వ్యాన్‌ ఎక్కించేందుకు వచ్చిన మూడు సంవత్సరాల చిన్నారి భవిష్య (3) ఆ వ్యాన్‌ చక్రాల కింద పడి మృతి చెందింది.

Breaking: హైదరాబాద్ లో పెను విషాదం.. స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి!
New Update

హైదరాబాద్‌ సికింద్రాబాద్‌ జవహర్‌ నగర్ పీఎస్‌ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. తన అన్నని స్కూల్‌ వ్యాన్‌ ఎక్కించేందుకు వచ్చిన మూడు సంవత్సరాల చిన్నారి భవిష్య (3) ఆ వ్యాన్‌ చక్రాల కింద పడి మృతి చెందింది.

భవిష్య అనే 3 సంవత్సరాల చిన్నారి జవహర్‌ నగర్‌ ఆనంద్‌ నగర్‌ ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ కాలనీలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. భవిష్య అన్న రచన గ్రామర్‌ హైస్కూల్‌ లో చదువుతున్నాడు. రోజులాగానే స్కూల్‌ కి వెళ్లేందుకు బస్సు దగ్గరికి వస్తున్న సోదరుడితో కలిసి బస్సు దగ్గరికి వచ్చింది భవిష్య.

ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు బస్సు ముందు చక్రాల కింద పడింది భవిష్య. విషయం తెలియని వ్యాన్‌ డ్రైవర్‌ బస్సును ముందుకు కదిలించాడు. దీంతో చిన్నారి భవిష్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ సంఘటనకు బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ సంఘటన గురించి దర్యాప్తు చేస్తున్నారు.

కథనం అప్‌డేట్‌ అవుతుంది...

Also read: వన్‌ప్లస్‌ నుంచి మరో స్మార్ట్‌ ఫోన్‌..అదరి పోయే ఫీచర్స్‌ తో వచ్చేస్తుంది!

#hyderabad #3-year-child #accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe