AP: రామాలయ విగ్రహ ప్రతిష్టలో అపశృతి.. 200 మందికి ఫుడ్ పాయిజన్!

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కుర్లపల్లి గ్రామంలో రామాలయ విగ్రహ ప్రతిష్టలో అపశృతి చోటుచేసుకుంది. విగ్రహ ప్రతిష్ట వేడుకలో భాగంగా ప్రజలకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ ఆహారం తిన్న 200 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. బాధితులు చికిత్స పొందుతున్నారు.

AP: రామాలయ విగ్రహ ప్రతిష్టలో అపశృతి.. 200 మందికి ఫుడ్ పాయిజన్!
New Update

Ananthapuram: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. రాప్తాడు నియోజకవర్గం కుర్లపల్లి గ్రామంలో రామాలయ విగ్రహ ప్రతిష్ట అపశృతిలో చోటుచేసుకుంది. విగ్రహ ప్రతిష్ట వేడుకలో భాగంగా ప్రజలకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అయితే ఈ ఆహారం తిన్న 200 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. ఎడతెరిపిలేని వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్న వారందరినీ దగ్గరలోని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి, ఇతర ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించినట్లు స్థానికులు తెలిపారు.

ఇది కూడా చదవండి: TS: రైతులను మోసం చేస్తే కఠిన చర్యలుంటాయి.. సీఎం రేవంత్ వార్నింగ్!

అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితోపాటు పరిటాల శ్రీరామ్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదని, తొందరగానే కోలుకుంటారని వైద్యులు వెల్లడించినట్లు తెలిపారు.

#anantapur-district #200-people-have-food-poisoning
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe