Building collapse: మూడు అంతస్తుల భవనం కూలి..ఇద్దరు మరణించారు!

ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 12 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.

Building collapse: మూడు అంతస్తుల భవనం కూలి..ఇద్దరు మరణించారు!
New Update

ఉత్తర ప్రదేశ్‌(Uttarapradesh) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ఓ మూడంతస్తుల భవనం కూలిపోవడంతో (building collapsed) ఇద్దరు చనిపోగా..12 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘోర ఘటన జరిగింది.

సుమారు 3 గంటల సమయంలో ఓ మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 12 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

ఇప్పటి వరకు శిథిలాలు కింద చిక్కుకున్న 12 మందిని శిథిలాల నుంచి క్షేమంగా బయటకు తీసుకుని వచ్చినట్లు వారిని ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా ఎస్పీ దినేశ్‌ కుమార్ సింగ్‌ చెప్పారు.

ఆసుపత్రికి తరలించిన వారిలో చికిత్స తీసుకుంటూ ఇద్దరు మరణించారని వివరించారు. మరి కొంత మంది శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చని వెల్లడించారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌(NDRF), ఎస్టీఆర్‌ఎఫ్‌(SDRF) , పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు.

#building-collapse #uttarapradesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe