Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి... 21 మందికి తీవ్ర గాయాలు!

మధ్యప్రదేశ్‌లోని దిండోరి లో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత పికప్‌ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా.. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు

New Update
BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!

Road Accident: మధ్యప్రదేశ్‌లోని (Madhyapradesh)  దిండోరి లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత పికప్‌ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా.. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తుంది.

షాపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమాహి డియోరి గ్రామం నుండి బర్జార్ ఘాట్‌కు తిరిగి వస్తుండగా పికప్ వాహనం బ్రేకులు దెబ్బతిన్నాయి. దీంతో వాహనం అదుపు తప్పి 20 అడుగుల దిగువన ఉన్న పొలంలో బోల్తా పడింది.దీంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated soon...

Also read: లీప్‌ ఇయర్‌ అంటే ఏమిటి..? అసలు లీప్‌ ఇయర్‌ నాలుగేళ్లకొసారి ఎందుకు వస్తుంది!

Advertisment
Advertisment
తాజా కథనాలు