ఇదేం అభిమానం రా బాబూ.. పవన్‌కు ఎలా స్వాగతం చెప్పాడంటే..

New Update
ఇదేం అభిమానం రా బాబూ..  పవన్‌కు ఎలా స్వాగతం చెప్పాడంటే..

publive-image

పవన్‌ కల్యాణ్‌కు వెరైటీ స్వాగతం..

శ్రీకాళహస్తిలో జనసేన నేత కొట్టే సాయిపై సీఐ అంజూ యాదవ్‌ చేయి చేసుకున్న ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేయడానికి పవన్ కల్యాణ్ తిరుపతి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానశ్రయం చేరుకున్న పవన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ర్యాలీగా తిరుపతి బయలుదేరారు. దాదాపు 15 కిలోమీటర్లు అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో ఓ అభిమాని మాత్రం వెరైటీగా సేనానికి స్వాగతం పలికాడు.

క్రేన్‌కు వేలాడుతూ శాలువా కప్పి..

ఓ భారీ క్రేన్‌కు తాడుతో వేలాడుతూ వచ్చిన ఆ అభిమాని పవన్ కల్యాణ్ మెడలో దండవేసి, శాలువా కప్పి సత్కరించాడు. అనంతరం రెండు చేతులతో పవన్ బుగ్గలు తాకి ముద్దాడాడు. ఈ దృశ్యాలు అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అభిమాని ప్రేమకు జనసేనాని కూడా ఫిదా అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదేం అభిమానం రా బాబూ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు పవన్ కల్యాణ్‌ అభిమానులు అంటే ఆ మాత్రం ఉండాలని అంటున్నారు.

సీఐ అంజూ యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు..

ర్యాలీగా తిరుపతి వెళ్లిన పవన్ కల్యాణ్.. జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డిని కలిసి సీఐ అంజూ యాదవ్‌పై ఫిర్యాదుచేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న జనసేన కార్యకర్తలపై చేయి చేసుకోవడంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన విజ్ఞప్తి పట్ల ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే సీఐ వివాదాస్పద తీరుపై కమిటీ వేశామని.. ఆ కమిటీ దర్యాప్తు చేస్తుందని.. నివేదిక రాగానే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పవన్ మంగళవారం జరగనున్న ఎన్డీయే కూటమి భేటీలో పాల్గొనేందుకు తిరుపతి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు