TDP-JSP: టీడీపీ జనసేన జోష్.. దద్దరిల్లిన యువగళం విజయోత్సవ సభ..!

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం ముగింపు సందర్భంగా విజయనగరంలో నవశకం సభను ఏర్పాటు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇరు పార్టీ శ్రేణుల కోలహలంతో విజయోత్సవ సభ దద్దరిల్లుతోంది.

New Update
TDP-JSP: టీడీపీ జనసేన జోష్.. దద్దరిల్లిన యువగళం విజయోత్సవ సభ..!

TDP-JSP: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరంలో నవశకం సభను ఏర్పాటు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. నందమూరి బాలకృష్ణ సైతం సభకు హజరైయ్యారు. టీడీపీ శ్రేణులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒకేవేదికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ కనిపించడంతో పార్టీ శ్రేణుల కోలాహలం మిన్నంటింది.

నవశకం బహిరంగసభలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కామెంట్స్:

నారా లోకేష్ చంద్రబాబు వారసుడే కాదు..రాజకీయ పరిణితి కలిగిన నాయకుడని కుప్పం సభలోనే చెప్పాను.

పాదయాత్రలో నారా లోకేష్ బలమైన సైనికుడు అని కూడా రుజువు చేశారు.

జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మేం ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు.

యువగళంపై సైకో జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించాడో రాష్ట్రమంతా చూసింది.

పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు..బాధితులను ఓదార్చాడు.

అవినీతి నాయకుల బాగోతాన్ని ప్రజల్లో ఎండగట్టాడు..యువతకు భరోసానిచ్చాడు.

చంద్రబాబు పైసా అవినీతి చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసు పెట్టి 53రోజులు జైల్లో పెట్టాడు.

2024 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలుస్తారని వైసిపి సైకోలు ఊహించలేదు.

మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి టీడీపీ, జనసేన ఏకం కావాల్సిన చారిత్రాత్మ అవసరం ఏర్పడింది.

ప్రజలకు సుపరిపాలన దక్కనివ్వకూడదని సైకో జగన్ అనేక డ్రామాలాడుతున్నారు.

రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన రాకుండా అడ్డుకోవడం జగన్మోహన్ రెడ్డి తరం కాదు.

టీడీపీ, జనసేనలో బలహీన వర్గాల వారు నాయకులుగా పనిచేస్తున్నారు..వైసీపీలో బానిసలుగా పనిచేస్తున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి రాసిచ్చాడు.

బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ కు చీము, నెత్తరు ఉంటే తక్షణమే వైసీపీకి రాజీనామా చేసి బయటకు రావాలి.

ఉత్తరాంధ్రకు జగన్ చేస్తున్న అన్యాయంపై నిలదీసే దమ్ము మీకుందా?

ఉత్తరాంధ్రను జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు...దోచుకున్నాడు.

టీడీపీ, జనసేన కలిశాయి...ఇక వైసీపీకి దబిడిదిబిడే.

రానున్న ఎన్నికల్లో వైసీపికి డిపాజిట్లు కూడా రావు.

గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి.

కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీ మధ్య చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తాడు..మనం అప్రమత్తంగా ఉండాలి.
2024లో ఏపీకి పట్టిన దరిద్రాన్ని రాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపేయాలని కోరుతున్నా.

5కోట్ల ఆంధ్రులంతా గుర్తుపెట్టుకోవాలి..రానున్న ఎన్నికలు టీడీపీ-జనసేన – వైసీపీ మధ్య ఎన్నికలు కాదు.

రాష్ట్ర ప్రజలకు-దోపిడీదారుడికి మధ్య యుద్ధం.

ప్రజల కోసం ఒక్కటై టీడీపీ-జనసేన నాయకత్వాన్ని ఆదరించాలి, ఆశీర్వదించాలి.

Advertisment
తాజా కథనాలు