YSRTP Merging in Congress: కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం ఫిక్స్! ప్రకటించనున్న రాహుల్ గాంధీ?

తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం అంశం దాదాపు ఖరారైంది. హస్తం పార్టీలో వైఎస్ షర్మిల చేరిక ఫిక్స్ అయ్యింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విలీనంపై ఆదివారం అధికారికంగా ప్రకటించనున్నారు.

New Update
YSRTP Merging in Congress: కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం ఫిక్స్! ప్రకటించనున్న రాహుల్ గాంధీ?

YSRTP Merging in Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని (YSRTP) కాంగ్రెస్ పార్టీలో(Congress) విలీనం అంశం దాదాపు ఖరారైంది. హస్తం పార్టీలో వైఎస్ షర్మిల చేరిక ఫిక్స్ అయ్యింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విలీనంపై ఆదివారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా వైఎస్ షర్మిలకు కీలక పదవి ఇస్తామని కాంగ్రెస్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తారని సమాచారం అందుతోంది. కాగా, కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీని విలీనం చేసే అంశంపై కాంగ్రెస్‌కు నేటి వరకు డెడ్‌లైన్ విధించారు. ఆ డెడ్‌లైన్ ఇవాళ్టితో ముగిసింది. షర్మిల విధించిన డెడ్‌లైన్ ముగియడంతో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీని విలీనం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది.

అయితే, షర్మిల రాకను తెలంగాణ కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. తమ వ్యతిరేకతను పార్టీ అధిష్టానం ముందే వెల్లడించారట. ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్‌లో విలీనం ప్రక్రియ ఆలస్యమైంది. కర్నాటక ఎన్నికల తరువాత ఆ రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్‌ను కలిశారు వైఎస్ షర్మిల. ఆ భేటీ సందర్భంగానే ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారట. అలా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పలు ధఫాలు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా కలిశారు షర్మిల. అయితే, తెలంగాణ కాంగ్రెస్‌లోనే ముఖ్య నేతలు ఆమె రాకను వ్యతిరేకిస్తుండటంతో అధిష్టానం సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలోనే షర్మిల డెడ్‌లైన్ విధించడం, ఆ డెడ్‌లైన్ ముగియడం జరిగింది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో చర్చోప చర్చలు జరిపిన పార్టీ హైకమాండ్.. చివరకు వారిని ఒప్పించింది. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపో మాపో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

Also Read:

Nara Bhuvaneshwari: భువనేశ్వరి నిరాహార దీక్ష.. బాలకృష్ణ సంచలన ప్రకటన

Ktr: తెలంగాణ ఎన్నికల కోసం కర్నాటకలో కాంగ్రెస్ పన్ను.. కేటీఆర్ సంచలన ట్వీట్

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mangoes: మామిడి పండ్లను తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి? కారణాలు ఇవే!

మామిడి పండ్లను తినడానికి ముందు 20 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. దీనివల్ల పురుగుమందులు, రసాయనాల ప్రభావాన్ని తగ్గుతుంది. మామిడి కాయ వేడి స్వభావం వల్ల కడుపులో చికాకు, మొటిమలు వంటి సమస్యలు రావచ్చు. నీటిలో నానబెట్టి తింటే జీర్ణక్రియకు తేలికగా అవుతుంది.

New Update
Mangoes

Mangoes

Mangoes: వేసవి కాలం వచ్చిందటే మామిడి పండ్లు ఎక్కువగా గుర్తుకు వస్తాయి. ఈ సీజన్‌లో వీటిని తినడానికి చిన్న, పెద్ద అంతా ఇష్టం పడతారు. అయితే.. మామిడి పండ్లను తినడానికి ముందు నీటిలో కొంత సమయం నానబెట్టమని పెద్దలు సలహా ఇస్తారు. కానీ దీని వెనుక ఉన్న కారణం చాలామందికి తెలియదు. లేకపోతే మామిడి పండ్లను మార్కెట్ నుండి ఇంటికి తెచ్చిన తర్వాత కొంత సమయం నీటిలో నానబెట్టమని ఎందుకు సలహా ఇస్తారో..? అలా చేయడానికి సరైన మార్గం ఏమిటో..? ఈ రోజూ ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మామిడి పండ్లను ఎందుకు నానబెట్టాలి:

మామిడి సాగు సమయంలో పురుగుమందులు, రసాయనాలను ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు పండ్ల తొక్కపై ఉండవచ్చు. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అటువంటి సమయంలో ఈ పురుగుమందులు, రసాయనాలను తొలగించడానికి మామిడిని 15-20 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. కొన్నిసార్లు మామిడి పండ్లను త్వరగా పండించడానికి కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. నీటిలో నానబెట్టడం వల్ల ఈ రసాయనాల ప్రభావాన్ని తగ్గించవచ్చు. మామిడికాయకు వేడి స్వభావం ఉంటుంది. దీని కారణంగా కొంతమందికి కడుపులో చికాకు, మొటిమలు, వేడి వంటి సమస్యలు రావచ్చు. కానీ మామిడికాయను నీటిలో కొంత సమయం నానబెట్టడం వల్ల దాని వేడి తగ్గుతుంది, జీర్ణక్రియకు తేలికగా ఉంటుంది.  

ఇది కూడా చదవండి: సింగిల్‌గా ఉంటే బ్రెయిన్ బాగా పని చేస్తుంది.. పెళ్లి చేసుకుంటే బుర్రపాడు పక్కా

మామిడి పండ్లను పొలాల నుండి మార్కెట్‌కు రవాణా చేసేటప్పుడు.. తొక్కపై దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా పేరుకుపోవచ్చు. కానీ నీటిలో నానబెట్టడం ద్వారా మామిడిపై ఉన్న ఈ మురికి శుభ్రం అవుతుంది. మామిడి తినడానికి సురక్షితంగా ఉంటుంది. మామిడి పండ్లను నానబెట్టడం వల్ల వాటి రుచి, ఆకృతి మెరుగుపడుతుందంటారు. ఇది ముఖ్యంగా చాలా తీపిగా, జ్యుసిగా ఉండే మామిడి పండ్లతో జరుగుతుంది. మామిడికాయను శుభ్రమైన నీటిలో దాదాపు అరగంట పాటు నానబెట్టాలి. మామిడికాయలను నానబెట్టడానికి గోరువెచ్చని నీటిని వాడాలి. కానీ వేడి నీటిని వాడవద్దు. నానబెట్టిన తర్వాత మామిడికాయను శుభ్రమైన నీటితో శుభ్రంగా కడిగి తొక్క తీసి తినాలి. ఎక్కువసేపు నానబెట్టడం వల్ల మామిడి రుచి చప్పగా ఉంటుంది. మామిడి పండ్లకు అలెర్జీ ఉంటే, ఏదైనా జీర్ణ సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మామిడిపండ్లను తినాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ 5 ఫుడ్‌ ఐటెమ్స్ తినే మహిళలు ఎక్కువ కాలం యవ్వనంగా ఎలా ఉంటారు?

( mangoes-tips | health tips in telugu | latest health tips | best-health-tips | home-tips | home tips in telugu | Latest News)

Advertisment
Advertisment