Macharla Incident: మాచర్ల ఘటనలపై సజ్జల సందేహాలు.. ఆ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలని ఈసీకి డిమాండ్!

మాచర్ల ఘటనలకు సంబంధించి ఈసీకి సజ్జల రామకృష్ణారెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. డియో అధికారిక వెబ్‌ కాస్టింగ్ నుంచి వస్తే.. ఎలా లీక్‌ అయ్యిందని ప్రశ్నించారు. మొత్తం 7 ఈవీఎంలు ధ్వంసమైతే కేవలం ఒక్క ఘటనకు సంబంధించిన వీడియో మాత్రమే ఎలా లీక్ అయ్యిందని ప్రశ్నించారు.

New Update
Macharla Incident: మాచర్ల ఘటనలపై సజ్జల సందేహాలు.. ఆ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలని ఈసీకి డిమాండ్!

మాచర్ల హింసాత్మక ఘటనలపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ అల్లర్లపై ఈసీకి ప్రశ్నలు సంధిస్తూ సజ్జల ట్వీట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి తమకు కొన్ని సందేహాలు ఉన్నాయన్నారు. వాటిని తప్పనిసరిగా పరిష్కరించాలన్న సజ్జల ఈసీని డిమాండ్ చేశారు. పాల్వాయి ఘటన వీడియో అధికారిక వెబ్‌ కాస్టింగ్ నుంచి వస్తే.. ఎలా లీక్‌ అయ్యిందని ప్రశ్నించారు. వీడియో నిజమా కాదా..అని చూడకుండా.. ఈసీ ఎందుకు తొందరగా కదిలింది? అని అన్నారు.

మాచర్లలో మొత్తం 7 ఈవీఎంలు ధ్వంసమైతే.. వాటిన్నింటిని పూర్తి స్థాయిలో ఎందుకు విడుదల చేయలేదన్నారు. ఆయా ఘటనల్లో దోషులను బయటపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటర్లపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తుమ్మూరు కోటలో ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేసిన వీడియోను సజ్జల విడుదల చేశారు.

Advertisment
తాజా కథనాలు