YS Sunitha: జగన్ కు బిగ్ షాక్.. పులివెందుల నుంచి పోటీలో వైఎస్ సునీత?

వైఎస్ సునీత పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డితో రహస్య మంతనాలు జరుపుతున్నారని సమాచారం. సునీత లేదా భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని బరిలో దింపేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

YS Sunitha: జగన్ కు బిగ్ షాక్.. పులివెందుల నుంచి పోటీలో వైఎస్ సునీత?
New Update

YS Sunitha: ఏపీ సీఎం జగన్ ఇలాఖాలో పొలిటికల్ హీట్ నెలకొంది. రానున్న ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా తాము పోరాడతామని, జగన్ కు ఓటు వేయవద్దని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైఎస్ సునీత పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: వారికి ఓటేయండి.. వైరల్ గా మారిన వెడ్డింగ్ కార్డ్..!

ఈ విషయంపై ఏపీ కాంగ్రెస్ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డితో వైఎస్ సునీత రెడ్డి రహస్య మంతనాలు జరుపుతున్నారని సమాచారం. వైఎస్ సునీత లేదా భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్ కు పోటీగా చెల్లి సునీత బరిలోకి దిగనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

#andhra-pradesh-cm-jagan #ys-sunitha-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe