AP: జగన్ కు మద్దతుగా మేనత్త.. కొడుకుకు మేలు చేసినందుకే అంటూ షర్మిల ఫైర్!

వైఎస్ షర్మిల, సునీతలపై వారి మేనత్త, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి విమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కుటుంబ పరువును రోడ్డుకు ఈడుస్తున్నారని మండిపడ్డారు. అయితే, కొడుకుకు మేలు చేసినందుకే విమలమ్మ జగన్ ను సపోర్టు చేస్తున్నారని షర్మిల ఫైర్ అయ్యారు.

New Update
AP: జగన్ కు మద్దతుగా మేనత్త.. కొడుకుకు మేలు చేసినందుకే అంటూ షర్మిల ఫైర్!

YS Sharmila - YS Vimala Reddy: వైఎస్ ఫ్యామిలీలో కొత్త వార్ తెరపైకి వచ్చింది. సీఎం జగన్ కు మద్దతుగా మేనత్త వైఎస్ విమలా రెడ్డి వెలుగులోకి వచ్చారు. షర్మిల, సునీత ఇద్దరూ తమ కుటుంబ పరువును రోడ్డున పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల కొంగు పట్టుకొని ఓట్లు అడుక్కొవడం ఎంటి.. కొంగు పట్టుకుని ఓట్లు అడుక్కునే వాళ్ళు వైఎస్ఆర్ బిడ్డ ఎలా అవుతారని ప్రశ్నించారు. వ్యక్తిగత స్వార్థం కోసమే వాళ్ళు ఇద్దరు ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

మీరు చూశారా?..

అవినాష్ రెడ్డి హత్య చేయడం షర్మిల, సునీతా చూశారా? హత్య చేసిన వాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు.. హత్యతో సంబంధం లేని భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు.. హత్యతో సంబంధం లేని అవినాష్ ని షర్మిల, సునీతా వేధిస్తున్నారని విమర్శలు గుప్పించారు. వివేకా అన్నను రాజశేఖర్ అన్నను ఆరాధించే వాళ్ళు వీళ్లిద్దరి చర్యలతో రోదిస్తున్నారని పేర్కొన్నారు.

పనిగట్టుకొని దుష్ప్రచారం

పులివెందులలో ఫ్యాక్షన్ ఉండకూడదని వైఎస్ఆర్ మొదటి నుంచి కట్టుబడి ఉన్నారని అయితే, కావాలని ఇప్పుడు వీళ్లు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి శత్రువులు అంతా షర్మిల చుట్టూ చేరారన్నారు. ఆస్తుల గొడవలు ఉన్నాయని ఈడి అటచ్ నుంచి రిలీజ్ అవ్వగానే వాటిని ఇచ్చేస్తాను అని జగన్ షర్మిలకు చెప్పారన్నారు.

Also Read: జగన్‌, షర్మిల మధ్య పొలిటికల్‌ వార్‌.. విదేశాలకు విజయమ్మ.. కారణం ఇదే..!

ఆధారాలు ఉన్నాయనే..

మేనత్త వైఎస్ విమలారెడ్డి వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. తాము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదన్నారు. వివేకా హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదు.. CBI చూపించిన ఆధారాలు మాత్రమే ఎత్తి చూపిస్తున్నామన్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసిందని.. అందుకే మేము ఇలా మాట్లాడుతున్నామని వివరించారు. ఈ హత్యా రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నామన్నారు. హంతకులు చట్టసభల్లో వెళ్ళొద్దని పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అందుకే మద్దతూ..

విమలమ్మ కొడుక్కి జగన్ వర్క్స్ ఇచ్చారని.. ఆర్థికంగా బలపడ్డారని అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ చనిపోయింది సొంత ఆన్న అని విమలమ్మ తెలుసుకోవాలన్నారు. వివేకా ఎంత చేశారో విమలమ్మ మరిచిపోయిందన్నారు. విమలమ్మకి వయసు మీద పడిందని..అందులో ఎండాకాలం.. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతుందని దుయ్యబట్టారు.

Advertisment
తాజా కథనాలు