YS Jagan: దువ్వాడకు షాకిచ్చిన జగన్.. ఇన్‌ఛార్జ్‌ పదవి ఔట్!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీ అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. టెక్కలి ఇన్‌ఛార్జ్‌ పదవి నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ అధినేత జగన్ తొలగించారు. దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్‌ను నియమించారు. శ్రీనివాస్ ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు జగన్.

New Update
YS Jagan: దువ్వాడకు షాకిచ్చిన జగన్.. ఇన్‌ఛార్జ్‌ పదవి ఔట్!

Duvvada: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. కొంతకాలంగా కుటుంబ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో దువ్వాడపై వేటు వేసింది. ఈ మేరకు టెక్కలి ఇన్‌ఛార్జ్‌ పదవి నుంచి దువ్వాడను శ్రీనివాస్ ను తొలగిస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ తెలిపారు. దువ్వాడ స్థానంలో టెక్కలి ఇన్ ఛార్జ్ బాధ్యతలను పేరాడ తిలక్‌కు అప్పగించారు.

ఇదిలా ఉంటే.. దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. తాను ఉంటున్న ఇంటిని కాపాడుకునేందుకు దువ్వాడ శ్రీను కొత్త ప్లాన్‌ వేశారు. ఇంటికి ఎమ్మెల్సీ ఆఫీస్‌గా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఒకవైపు ఆ ఇంటిపై తనకు హక్కు కావాలని భార్య వాణి అంటుండగా.. మరోవైపు ఆ ఇంటికి తాను రూ.2 కోట్లు ఇచ్చానని దివ్వల మాధురి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఇంటిని పార్టీ ఆఫీస్‌గా మార్చారనే ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, వాణి వివాదంపై వారి బంధువులు రాజీ కుదర్చడానికి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్‌కు భార్య వాణి తన ఐదు డిమాండ్స్ ను ముందుంచారు. తొలి 4 డిమాండ్లకు ఒప్పుకున్న దువ్వాడ శ్రీనివాస్ ఐదో డిమాండ్‌ను తిరస్కరించారు. ఎందుకంటే ఐదో డిమాండ్ గా దువ్వాడ ఉంటున్న కొత్త ఇంటిని వాణి అడిగారు. అయితే, తనకంటూ మిగిలిన కొత్త ఇంటిపై తక్షణమే వీలునామా రాస్తే.. తనకు జరగరానిది ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని శ్రీనివాస్ వెనకడుగు వేశారు. ఇలా ఐదో డిమాండ్ దగ్గర దువ్వాడ కుటుంబం పంచాయితీ ఆగిపోయింది.

#takkali #duvwada-srinivas #ys-jagan
Advertisment
తాజా కథనాలు