/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/parlament-jpg.webp)
దేశంలోని పాత పార్లమెంటు భవనం నేటి నుంచి చరిత్రలో నిలిచిపోనుంది. ఇక్కడి ఎంపీలకు ఈరోజు చివరి రోజు. ఆ తర్వాత కొత్త పార్లమెంట్ భవనంలో కూర్చోనున్నారు. ఈ జ్ఞాపకాలను కాపాడేందుకు, పాత పార్లమెంట్ హౌస్లో ఎంపీల ఫోటో సెషన్ను ఏర్పాటు చేశారు, అందులో లోక్సభ, రాజ్యసభ ఎంపీలందరి గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముందు వరుసలో కూర్చున్నారు.
వెనుక వరుసలో నిలబడిన రాహుల్ గాంధీ:
ఫోటో సెషన్ సమయంలో రాహుల్ గాంధీ వెనుక వరుసలో నిల్చున్నారు. వెనక వరుసలో ఆయన కనిపించిన తీరు చర్చనీయాంశంగా మారింది. రాహుల్ ఎందుకు వెనుక నిల్చుని ఫోన్లో చూస్తే కనిపించడం ప్రత్యేక చర్చకు దారి తీసింది. ఎంపీల ఫోటో సెషన్ పూర్తయిన తర్వాత, సెంట్రల్ హాల్లో ఫంక్షన్ ప్రారంభమైంది, ఇందులో ప్రధాని మోదీ ఎంపీలందరినీ కలుసుకుని వారి శుభాకాంక్షలు స్వీకరించారు.
&
#WATCH | Delhi: Members of Parliament gathered for a joint photo session ahead of today's Parliament Session.
The proceeding of the House will take place in the New Parliament Building, starting today. pic.twitter.com/4e86nGDcQu
— ANI (@ANI) September 19, 2023
ఫోటో సెషన్ సమయంలో, బీజేపీ ఎంపీ నరహరి అమీన్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. అతను కళ్లు తిరిగి పడిపోయారు. అనంతరం కోలుకుని ఫొటో సెషన్లో పాల్గొన్నారు.
#WATCH | BJP MP Narhari Amin fainted during the group photo session of Parliamentarians. He has now recovered and is a part of the photo session. pic.twitter.com/goeqh9JxGN
— ANI (@ANI) September 19, 2023
ఓల్డ్ పార్లమెంట్ హౌస్లో నేటి పార్లమెంట్ సమావేశానికి ముందు పార్లమెంట్ సభ్యులందరూ ఉమ్మడి ఫోటో కోసం సమావేశమయ్యారు. ఈ సమయంలో, ఎంపీల బృందం మూడు వేర్వేరు ఫోటోలు తీసుకున్నారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi, Rajya Sabha Chairman and Vice President Jagdeep Dhankhar, Lok Sabha Speaker Om Birla and other Parliamentarians gather for the joint photo session ahead of today's Parliament Session. pic.twitter.com/burhE7OGX1
— ANI (@ANI) September 19, 2023
నేటి నుంచి ప్రత్యేక సమావేశాలు కొత్త పార్లమెంట్ హౌస్లో జరుగనున్నాయి.