Tirupati YCP: మంత్రి రోజాకు టికెట్ ఇస్తే రాజీనామా చేస్తాం..తేల్చిచెప్పిన వైసీపీ నాయకులు

మంత్రి రోజా కక్ష సాధింపుతో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారన్నారు పుత్తూరు వైసీపీ నాయకులు, ZPTC వాడమాలపేట మురళిరెడ్డి. మంత్రి రోజా సోదరులు 5 మండలాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రోజాకు టికెట్ ఇస్తే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు.

New Update
Tirupati YCP: మంత్రి రోజాకు టికెట్ ఇస్తే రాజీనామా చేస్తాం..తేల్చిచెప్పిన వైసీపీ నాయకులు

YCP ZPTC Murali: పుత్తూరు వైసీపీ నాయకులు, ZPTC వాడమాలపేట మురళిరెడ్డి మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కక్ష సాధింపుతో అభివృద్ధి పనులను మంత్రి రోజా అడ్డుకుంటున్నారన్నారు. శిలాఫలకాలకు మంత్రి టైం స్పెండ్ చేస్తోంది..కానీ, అభివృద్ధికి మాత్రం సమయం కేటాయించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజా సోదరులు 5 మండలాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. క్వారీలు, ఇసుక, ప్రభుత్వ భూముల దందాకు తెర లేపారని మండిపడ్డారు.

Also Read: వివేక హత్య కేసు.. జగన్ పాత్రపై సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

అభివృద్ధి పనుల్లో వాటాలడుగుతూ వైసీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి రోజను గెలిపించినందుకు మాకు మంచి గుణపాఠం నేర్పిందని వాపోయారు. నియోజకవర్గం మొత్తం ఐదు మండలాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పుకొచ్చారు. మంత్రి రోజాకు టికెట్ ఇవ్వద్దని 5 మండలాల నాయకులం అధిష్టానంకు ఫిర్యాదు చేశామని కామెంట్స్ చేశారు.

Also Read: కొత్త పెళ్లి కూతుర్లూ.. ఇది మీ కోసమే.. అత్తమామలను ఫ్లాట్‌ చేసే చిట్కాలు!

రోజాకు టికెట్ ఇస్తే టీడీపీ అభ్యర్థి భాను గెలుస్తాడని జోస్యం చెప్పారు. రోజాకు టికెట్ ఇస్తే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని తేల్చిచెప్పారు. తాము రోజాను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని..పార్టీని వ్యతిరేకించడం లేదని తెలిపారు. రోజాను కాదని వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా వైసీపీ నాయకులు ఐక్యంగా పోరాడి గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నగిరి నియోజకవర్గ అభ్యర్థిత్వంపై సీఎం జగన్ ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు