YCP MP: వైసీపీకి మరో ఎంపీ రాజీనామా.. క్లారిటీ!

AP: పార్టీ మారడంపై స్పందించారు వైసీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌తోనే ఉంటానని అన్నారు. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైరయ్యారు.

YCP MP: వైసీపీకి మరో ఎంపీ రాజీనామా.. క్లారిటీ!
New Update

MP Meda Raghunath Reddy: ఏపీ రాజకీయాల్లో రాజీనామాలు, చేరికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీ నుంచి నేతలు ఒకరొకరుగా రాజినామా చేస్తున్నారు. వైసీపీకి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చారు మేడా రఘునాథ్ రెడ్డి. తాను పార్టీ మారడం లేదని తేల్చి చెప్పారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

కొందరు కావాలనే తనను రాజకీయం ఇబ్బంది పెట్టాలని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ తోనే ప్రయాణం అని అన్నారు. తాను పార్టీ మారుతున్నానని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఇదంతా తప్పుడు ప్రచారం.. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. నేను వైఎస్సార్‌సీపీని వీడేది లేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పారు.

#mp-meda-raghunath-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe