AP: కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా.. వ్యక్తి హల్‌చల్.!

జగన్ ఓడిపోవడంలో ఈవీఎంల ట్యాంపరింగ్ ఉందని వైసీపీ అభిమాని రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. రాజమండ్రి గామన్ బ్రిడ్జిపై నుండి గోదావరిలో దూకి తన కుటుంబ మొత్తం ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్ చేశాడు. సకాలంలో స్పందించిన పోలీసులు వారిని అడ్డుకొని క్షేమంగా ఇంటికి చేర్చారు.

New Update
AP: కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా.. వ్యక్తి హల్‌చల్.!

AP: జగన్ ఓడిపోవడంలో ఈవీఎంల ట్యాంపరింగ్ ఉందని ఈ వీడియో ద్వారా రాష్ట్రపతికి తెలియజేయాలని వైసీపీ అభిమాని రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. రాజమండ్రి గామన్ బ్రిడ్జిపై నుండి గోదావరిలో దూకి తన కుటుంబ మొత్తం ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశాడే.

Also read: కేశినేని నాని కార్యాలయం మూసివేత.. జగన్‌తో దిగిన బోర్డులు తీసేసిన సిబ్బంది.!

ఇప్పటికిప్పుడు మళ్లీ ఎలక్షన్ జరపాలని ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ జరిగితే జగనన్నే అధిక మెజారిటీతో గెలుస్తాడని ఆవేదన వ్యక్తం చేశాడు. సకాలంలో స్పందించిన పోలీసులు.. వారిని అడ్డుకొని నచ్చజెప్పారు. కొవ్వూరు పట్టణ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులను క్షేమంగా ఇంటికి చేర్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు