AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఫ్లెక్సీల కలకలం..!

ఏలూరు జిల్లా కైకలూరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. 2019 - 2024 వరకు దూలం చేసిన అరాచకాలంటూ జనసేన నాయకుడు కొల్లి వరప్రసాద్ పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

New Update
AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఫ్లెక్సీల కలకలం..!

Eluru: ఏలూరు జిల్లా కైకలూరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. 2019 నుండి 2024 వరకు చేసిన అరాచకాలు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా విగ్రహం వద్ద జనసేన నాయకుడు కొల్లి వరప్రసాద్ పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Also Read: దెందులూరులో హై టెన్షన్.. కాకరేపుతోన్న విద్వేష రాజకీయాలు..!

గత ఐదేళ్లు పాలనలో అనేక అక్రమాలు, ఆక్రమణలు, దౌర్జన్యాలు చేశారంటూ పట్టణంలోని నాలుగు ప్రధాన కూడళ్ళలో ఎమ్మెల్యే బాధితుల సంఘం అధ్యక్షుడు అంటూ కొల్లి వరప్రసాద్ (బాబి) పేరిట ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు