Yanamala: ఏపీ ఇక సర్ ప్లస్ స్టేట్.. మాజీ ఆర్థిక మంత్రి యనమల!
అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటున్నానన్నారు యనమల రామకృష్ణుడు. దోచుకునే నాయకత్వం పోయి, కమిటెడ్ నాయకత్వం వచ్చిందన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ విధ్వంసకర పాలన సాగించిందని.. దివాలా తీసిన రాష్ట్రాన్ని సర్ ప్లస్ రాష్ట్రంగా చెప్పుకునే అవకాశం వచ్చిందన్నారు.
Yanamala Rama Krishnudu: గత ఐదేళ్లలో వైసీపీ (YCP) విధ్వంసకర పాలన సాగించిందన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు చాలా ప్రాముఖ్యత ఉందని.. ప్రజల అవసరాలు తీర్చడానికే చట్టసభలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. శాసనసభలో గత ఐదేళ్లు దారుణమైన విధానాలు అవలంభించారన్నారు. ప్రతిపక్షాన్ని అణచివేసి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదని.. ప్రతిపక్ష శాసన సభ్యులు మాట్లాడే ప్రయత్నం చేస్తే సస్పెండ్ చేసేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాన్ని అవమానపరిచారు కాబట్టే అంత దారుణంగా ఓటమిపాలయ్యారన్నారు. ఏ ప్రభుత్వమైనా చట్టసభల్లో డిబేట్స్ జరిగే విధానాన్ని అవలంభించాలని.. మా ప్రభుత్వం దానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వ్యవస్థలను పునరుద్ధరించి గాడిలో పెట్టాలన్నారు. అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటున్నానని.. దోచుకునే నాయకత్వం పోయి, కమిటెడ్ నాయకత్వం వచ్చిందని కామెంట్స్ చేశారు. దివాలా తీసిన రాష్ట్రాన్ని సర్ ప్లెస్ రాష్ట్రంగా చెవుకునే అవకాశం వచ్చిందని.. మోడీ, చంద్రబాబు, పవన్ నాయకత్వం పని చేస్తుందని వ్యాఖ్యానించారు.
Yanamala: ఏపీ ఇక సర్ ప్లస్ స్టేట్.. మాజీ ఆర్థిక మంత్రి యనమల!
అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటున్నానన్నారు యనమల రామకృష్ణుడు. దోచుకునే నాయకత్వం పోయి, కమిటెడ్ నాయకత్వం వచ్చిందన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ విధ్వంసకర పాలన సాగించిందని.. దివాలా తీసిన రాష్ట్రాన్ని సర్ ప్లస్ రాష్ట్రంగా చెప్పుకునే అవకాశం వచ్చిందన్నారు.
Yanamala Rama Krishnudu: గత ఐదేళ్లలో వైసీపీ (YCP) విధ్వంసకర పాలన సాగించిందన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు చాలా ప్రాముఖ్యత ఉందని.. ప్రజల అవసరాలు తీర్చడానికే చట్టసభలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. శాసనసభలో గత ఐదేళ్లు దారుణమైన విధానాలు అవలంభించారన్నారు. ప్రతిపక్షాన్ని అణచివేసి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదని.. ప్రతిపక్ష శాసన సభ్యులు మాట్లాడే ప్రయత్నం చేస్తే సస్పెండ్ చేసేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: పోరంబోకు స్థలంలో నిర్మించారు.. ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ ఫైర్..!
ప్రతిపక్షాన్ని అవమానపరిచారు కాబట్టే అంత దారుణంగా ఓటమిపాలయ్యారన్నారు. ఏ ప్రభుత్వమైనా చట్టసభల్లో డిబేట్స్ జరిగే విధానాన్ని అవలంభించాలని.. మా ప్రభుత్వం దానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వ్యవస్థలను పునరుద్ధరించి గాడిలో పెట్టాలన్నారు. అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటున్నానని.. దోచుకునే నాయకత్వం పోయి, కమిటెడ్ నాయకత్వం వచ్చిందని కామెంట్స్ చేశారు. దివాలా తీసిన రాష్ట్రాన్ని సర్ ప్లెస్ రాష్ట్రంగా చెవుకునే అవకాశం వచ్చిందని.. మోడీ, చంద్రబాబు, పవన్ నాయకత్వం పని చేస్తుందని వ్యాఖ్యానించారు.