యమునా వరద తగ్గిన తర్వాత, సోమవారం ఉదయం నాటికి యమునా ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటల వరకు యమునా నీటిమట్టం తగ్గింపు ప్రక్రియ కొనసాగింది. దీని తర్వాత నీటి మట్టం పెరగడం ప్రారంభమైంది. పాత రైల్వే వంతెన సమీపంలో రాత్రి 10 గంటలకు యమునా నీటి మట్టం 206 మీటర్లకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో వరద ముప్పు నుంచి ఢిల్లీ ఇంకా బయటపడలేదు.
పూర్తిగా చదవండి..మళ్లీ పెరిగిన యమునా నీటి మట్టం..కొనసాగుతోన్న వరద ముప్పు..!!
దేశ రాజధాని ఢిల్లీ ఇంకా జలదిగ్భందంలోనే ఉంది. సోమవారం యమునా నది నీటి మట్టం తగ్గినట్లే తగ్గి...మరోసారి భారీగా పెరిగింది. దీంతో ఢిల్లీ మరోసారి వరదముంపును ఎదుర్కొవల్సి వస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వరదనీటిలో చిక్కుకున్నాయి. అటు వరద బాధితులు సహాయక శిబిరాల్లోనే ఉండాలని కేబినెట్ మంత్రి అతిషి విజ్ఞప్తి చేశారు. యమునా నది నీటిమట్టం పెరగడం వల్ల ఢిల్లీలో ఎలాంటి ప్రమాదం లేదని ఆయన ట్వీట్ చేశారు. హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా యమునా నది నీటిమట్టం స్వల్పంగా పెరిగిందని తెలిపారు.
Translate this News: