గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఢిల్లీలోని యమునా నది ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది. ఎగువన ఉన్న హర్యానా నుంచి వరదనీరు భారీగా చేరడంతో యమునా నది డేంజర్ జోన్లో ఉంది. అయితే మంగళవారం ఢిల్లీలో వాతావరణంలో కొద్దిగా మార్పులు కనిపించాయి. మబ్బులు ఉన్నప్పటికీ వర్షం కురవలేదు. ఉష్ణోగ్రతలో స్వల్ప పెరుగుదల కూడా కనిపించింది. రానున్న మూడు రోజుల పాటు వాతావరణం ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 32.5 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగా, కనిష్ట ఉష్ణోగ్రత 24.4 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగా నమోదైంది.
పూర్తిగా చదవండి..ఉప్పొంగిన యమునా..ప్రమాదకరస్థాయిలో నీటి ప్రవాహం..!!
ఉత్తరాదిన వర్షాలు కొంతమేర తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గత మూడు రోజులుగా కుండపోతగా కురిసిన నేపథ్యంలో ఢిల్లీలోని యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న హర్యానా నుంచి భారీగా వరద పోటెత్తుతుండటంతో నది నీటిమట్టం ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుంది.
Translate this News: