ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యమునా నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ఉప్పెన కారణంగా, యమునా నీటి మట్టం 207.25 మీటర్లకు పెరిగింది. ఇది 1978 నుండి అత్యధిక రికార్డు స్థాయి 207.49కి దగ్గరగా ఉంది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) వరద పర్యవేక్షణ పోర్టల్ ప్రకారం, పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నీటి మట్టం 2013 తర్వాత 4 గంటలకు మొదటిసారిగా 207 మీటర్ల మార్కును దాటింది. బుధవారం ఉదయం 8 గంటలకు 207.25 మీటర్లకు పెరిగింది. నీటిపారుదల, వరద నియంత్రణ శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి నది నీటిమట్టం 207.35 మీటర్లకు చేరుకుంటుందని, అది మరింతగా పెరుగుతుందని తెలిపారు.
పూర్తిగా చదవండి..ప్రమాదకరస్థాయిలో యమునా నది, సీఎం అత్యవసర సమావేశం..!!
ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో యమునా నది నీటిమట్టం రికార్డు స్థాయికి చేరుకుంది. IMD ప్రకారం, ఆదివారం ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది 1982 తర్వాత కురిసిన అత్యధిక వర్షాపాతంగా రికార్డులోకి ఎక్కింది.
Translate this News: