మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఇవాళ్టి నుంచి వై ప్లస్ భద్రతను ఇవాళ్టి నుంచి కల్పించనుంది తెలంగాణ సర్కార్. ఈటల ప్రాణానికి హాని ఉందని నిర్దారించిన తెలంగాణ ప్రభుత్వం వై ప్లస్ భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం రాత్రి వెలువడ్డాయి. తనకు ప్రాణహాని ఉందంటూ ఈటల రాజేందర్ ఈ మధ్యే మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన భార్య జమున కూడా ఇదే విషయాన్నిమరోసారి స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..నేటి నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు వై ప్లస్ కేటగిరీ భద్రత..!!
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు వైఫ్లస్ కేటగిరీ సెక్యూరిటీని నేటి నుంచి తెలంగాణ సర్కార్ కల్పించనుంది. ఈటెల రాజేందర్ కు ఇదే వై కేటగిరి సెక్యూరిటీని కేంద్ర బలగాలతో కల్పించేందుకు కేంద్రప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. ఈటల రాజేందర్ కు ప్రాణహాని ఉందని తెలంగాణ సర్కార్ నిర్ధారించడంతో ఈ వై ప్లస్ భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
Translate this News: