ఇండియా(India) వర్సెస్ పాక్(pakistan) మ్యాచ్ అంటే క్రికెట్(cricket) అభిమానులకు పూనకాలే.. కేవలం భారత్, పాకిస్థాన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ క్రికెట్ ప్రపంచం ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటే టీవీలకు అతుక్కుపోతారు. అటు స్టేడియం నిండిపోతుంది.. టికెట్ల కోసం జనం ఎగపడతారు. అందులోనూ వరల్డ్ కప్(world cup) లాంటి మెగా టోర్నిలో ఇండియా, పాక్ తలపడుతున్నాయంటే ఆ కిక్కే వేరు. ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5న ప్రారంభమవుతుండగా.. టోర్నమెంట్ మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఇండియా, పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సి ఉండగా.. దాన్ని రీషెడ్యూల్ చేసే పనిలో బిజీగా ఉంది బీసీసీఐ.
పూర్తిగా చదవండి..ఇండియా, పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే..?
ప్రపంచకప్లో అన్ని మ్యాచ్లు ఒక ఎత్తు.. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ మరో ఎత్తు. షెడ్యూల్ ప్రకారం ఇరు జట్లు అక్టోబర్ 15న అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో తలపడాల్సి ఉండగా.. ఆ డేట్ని రీషెడ్యూల్ చేయనుంది బీసీసీఐ. అక్టోబర్ 15 నవరాత్రుల్లో తొలి రోజు కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ని ముందుగా జరిపే అవకాశం కనిపిస్తోంది.
Translate this News: