World Cup Finals: ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా.. వరల్డ్ కప్ ఫైనల్స్ కి చేరిన టీమిండియా ఆదివారం ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోంది. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్స్ జరగబోతోంది. ఫైనల్స్ చూడటం కోసం ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరు కానున్నారని చెబుతున్నారు. ఇక క్రికెట్ అభిమానుల సందడికి హద్దే లేకుండా పోయింది. ఈసారి భారత్ కప్ కచ్చితంగా కొడుతుందని అందరూ నమ్ముతున్నారు. అందుకే గ్రౌండ్ లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ ను చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ ఇప్పటికే సందడిగా మారిపోయింది. మ్యాచ్ చూడటం కోసం దూర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు వచ్చేస్తున్నారు. దీంతో విమాన టికెట్ల ధరలు రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి.
పూర్తిగా చదవండి..World Cup Finals: క్రికెట్ ఫైనల్స్ ఫీవర్..విమానం టికెట్ రేట్ల రాకెట్ స్పీడ్..లక్షల్లో హోటల్ గది..
భారత్ ఆడుతున్నసాధారణ క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. మరి వరల్డ్ కప్ ఫైనల్ అంటే.. ఆ ఫీవర్ వేరే లెవెల్ కదా. అహ్మదాబాద్ లో ఆదివారం జరిగే ఫైనల్స్ కోసం విమాన టికెట్ల రేట్లు ఆరు రెట్లు పెరిగాయి. లగ్జరీ హోటల్ గది అద్దె 2 లక్షల వరకూ చేరుకుంది.
Translate this News: