Siddipet: సీటుకోసం సిగపట్లు.. చెప్పులతో కొట్టుకున్న మహాలక్ష్ములు

బస్సులో సీటుకోసం మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వెళ్తున్న ఆర్టీసీ బస్సులో వెంకట్రావు పేట గ్రామం వచ్చేసరికి ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. దీంతో సీట్ల కోసం తగువులాడిన మహిళలు జుట్లు పట్టుకుని, చెప్పులతో కొట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Siddipet: సీటుకోసం సిగపట్లు.. చెప్పులతో కొట్టుకున్న మహాలక్ష్ములు
New Update

Siddipet: తెలంగాణలో ఫ్రీ బస్సు గొడవ మరోసారి మహిళలు మధ్య చిచ్చు రేపింది. ఇటీవలే సీట్ కోసం ఓ ఇద్దరు యువతులు చంకన పసిపిల్లలున్న విషయం మరిచి విచక్షణ రహితంగా కొట్టుకున్న సంఘటన మరవకముందే మరోచోట తగువులాడుకున్నారు. సీటు కోసం సిగలు పట్టుకుని, చెప్పులతో దారుణంగా కొట్టుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

వెంకట్రావు పేట..

ఈ మేరకు నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావు పేటలో ఈ గొడవ జరిగింది. సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వెళ్తున్న ఆర్టీసీ బస్సులో వెంకట్రావు పేట గ్రామం వచ్చేసరికి ప్రయాణికులు కిక్కిరిసి పోయారు. దీంతో సీట్ల దొరకకపోవడంతో చాలామంది నిలబడే ఉన్నారు.

ఇది కూడా చదవండి : BIG BREAKING: హైదరాబాద్ లో తొలి ఉరిశిక్ష.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

సీటు నాదంటే నాది అంటూ..

అయితే ఒక స్టేజీ వద్ద ఒక సీటు ఖాళీ కావడంతో ఆ పక్కనే నిలుచున్న మహిళలు సీటు నాదంటే నాది అంటూ గొడవపడ్డారు. విచక్షణ మరిచి చెప్పులతో కొట్టుకున్నారు. ఎంతమంది ఆపినా ఆగకుండా పిచ్చి పిచ్చిగా కొట్టుకున్నారు. చివరికి కొంతమంది పురుషులు, కండక్టర్ కలగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.  ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. మరోసారి ఆర్టీసీ ఫ్రీ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా ఉచితాలు తీసేసి 50 శాతం అయినా పెట్టాలని పలువురు గవర్నమెంట్ కు సూచిస్తున్నారు.

#ladies-fight #tsrtc #siddipet
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe