నాలుగేళ్ల క్రితం మోడీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై గుజరాత్ హైకోర్టు నేడు తీర్పును వెలువరించనుంది. జస్టిస్ హేమంత్ ప్రచాక్ బెంచ్ ఈ పిటిషన్ను విచారించి ఉదయం 11.00గంటలకు తీర్పును వెలువరించనుంది. ఈ కేసులో మార్చి 23న సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్దారించి రెండేళ్లు శిక్ష విధించింది.
సూరత్ కోర్టు విధించిన శిక్షను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ హైకోర్టును ఆశ్రయించారు. దోషిగా తేలడంతో రాహుల్ లోకసభ సభ్యత్వానికి అనర్హుడయ్యాడు. లోకసభ సభ్యత్వం రద్దయిన తర్వాత కేరళలోని వాయనాడ్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తన గొంతును అణచివేసేందుకు కేంద్రం పనిచేస్తోందని..దానికి తానే భయపడనని అన్నారు.
ఈ పరిస్థితిలో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన శిక్షపై నిర్ణయాన్ని నిలిపివేసినట్లయితే...రాహుల్ పై ఉన్న అనర్హత కేసును కూడా కొట్టివేసే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం రాహుల్ పై 2ప్లస్ 6 ఏళ్లపాటు పార్లమెంట్ సభ్యుని సస్పెన్షన్ లో ఉన్నారు. ఈ కేసులో రాహుల్ కు బెయిల్ లభించింది. తన శిక్షా నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏప్రిల్ 3న సూరత్ సెషన్స్ కోర్టును రాహుల్ గాంధీ ఆశ్రయించాడు. ఈ శిక్షపై స్టే విధించాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు. రాహుల్ కు బెయిల్ మంజూరు అయ్యింది. తన నేరాన్ని నిలిపివేయాలంటూ రాహుల్ చేసిన దరఖాస్తు ఏప్రిల్ 20న తిరస్కరణకు గురైంది.
అసలు విషయం ఇది:
2019లో కర్నాటకలో జరిగిన ర్యాలీలో గాంధీ, “దొంగలందరికీ మోడీ ఇంటిపేరు ఎలా వచ్చింది?”రాహుల్ వ్యాఖ్యపై దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల్లో ఆగ్రహానికి కారణం అయ్యింది. పరారీలో ఉన్న లలిత్ మోదీ, నీరవ్ మోదీలను ప్రస్తావిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ కేసు పెట్టారు. దీంతో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు నమోదు అయ్యింది.