ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు రానే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ లోని వాతవరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు తెలిపింది. కాగా రెండు రోజుల క్రితం ఖమ్మంలోకి ఎంటరైన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. నేటితో తెలంగాణ అంతటా విస్తరిస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు షురూ అయ్యాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంతోపాటుగా యాద్రాద్రి భువనగిరి, ములుగు జిల్లాల్లో మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..విస్తరించిన రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Translate this News: