వామ్మో ఢిల్లీకి విమానంలో పోవాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే.!!

New Update

ఇటీవలి కాలంలో ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో విమాన ఛార్జీలు ఎక్కువగా పెరిగాయి. దీంతో విమాన ప్రయాణానికి గతంలో కంటే ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఎయిర్‌పోర్టుల కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ATI ఆసియా-పసిఫిక్) ప్రకారం, భారతదేశంలో విమాన ఛార్జీలు 41 శాతం పెరిగాయి. అదే సమయంలో UAEలో 34 శాతం, సింగపూర్ లో 30 శాతం, ఆస్ట్రేలియాలో 23 శాతం మాత్రమే పెరిగాయి.

Why are flight ticket prices increasing?

పెరిగిన విమాన ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది?

ఎంపిక చేసిన కొన్ని రూట్లలో విమాన ఛార్జీలు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఛార్జీలు 60 శాతం వరకు తగ్గాయని, కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ టిక్కెట్ ధరలను నిర్దిష్ట పరిమితిలో ఉంచాలని విమానయాన సంస్థలను కోరినట్లు తెలిపారు.

ఢిల్లీ నుండి ప్రధాన నగరాలకు విమాన ఛార్జీలు (జూన్ 2 నుండి 8 మధ్యలో)
ఢిల్లీ-బెంగళూరు: రూ. 33,747
ఢిల్లీ-ముంబై: రూ. 30,726
ఢిల్లీ- లేహ్: రూ. 13,090
ఢిల్లీ-పుణె: రూ. 27,710
ఢిల్లీ-శ్రీనగర్: రూ. 18,996 (సోర్స్- క్లియర్‌ట్రిప్)

విమాన ఛార్జీలు ఎలా నిర్ణయిస్తారు?
విమాన ఛార్జీల నిర్ణయంలో ప్రభుత్వం పాత్ర లేదు. డైనమిక్ ప్రైసింగ్ ఇందులో పనిచేస్తుంది, ఇది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడల్లా ధరలు పెరుగుతాయి. డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడల్లా ధరలు కూడా తగ్గుతాయి. దీంతో పాటు సెలవులు, పండుగలు, లాంగ్ వీకెండ్‌ల కారణంగా విమాన ఛార్జీలు కూడా చాలా రెట్లు పెరుగుతాయి.

ఉదాహరణకు, మీరు సెప్టెంబర్‌లో విమానంలో ప్రయాణించి, ఇప్పుడే టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే, మీరు తక్కువ డబ్బు చెల్లించాలి. విమాన ప్రయాణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ. విమాన ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి.

విమాన ఛార్జీలను ఎవరు నిర్ణయిస్తారు?
1994లో ఎయిర్ కార్పొరేషన్ చట్టం రద్దు చేసిన తర్వాత విమాన ఛార్జీలను ప్రభుత్వం నియంత్రించడంలేదు. ఇది పూర్తిగా విమానయాన సంస్థలపై ఆధారపడి ఉంటుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన భద్రతకు సంబంధించి మాత్రమే వ్యవహరిస్తుంది. దానికి విమాన ఛార్జీలతో ఎలాంటి సంబంధం లేదు. ప్రపంచంలోని చాలా దేశాల్లో విమాన ఛార్జీలను విమానయాన సంస్థలు నిర్ణయిస్తాయి.

విమాన ఛార్జీలు పెరగడానికి అనేక కారణాలున్నాయి.

- ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరల పెంపు.

- విమాన ప్రయాణానికి డిమాండ్‌ పెరిగింది.

-ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా అంతరాయాలు.

విమాన ఛార్జీలపై నియంత్రణ లేదని మంత్రిత్వ శాఖ ఇదివరకే పేర్కొంది. ఛార్జీలపై ధరల పరిమితిని విధించినట్లయితే, అది హిమాలయాల సంస్థలకు భారీ నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంటుంది అంతేకాదు మార్కెట్లో ప్రభుత్వ జోక్యం వల్ల ధరలు నియంత్రణ అనేది సాధ్యం కాదని చెబుతోంది. ఇదిలా ఉంటే విమానయాన సంస్థలు మాత్రం ఇప్పటికే తమ రంగం నష్టాల్లో కూడుకుపోయిందని. చాలా సంస్థలు ఇప్పటికే దివాలా తీశాయని చెబుతున్నాయి. అంతేకాదు విమానయాన రంగంలో ఇటీవల గో ఫస్ట్ విమానయాన సంస్థ దివాలా తీసింది. ఈ నేపథ్యంలో ఈ రంగంలో నష్టాలనుంచి గట్టెక్కేందుకు ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని విమానయాన సంస్థలు పేర్కొంటున్నాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe