Ugadi 2024: ఈ ఏడాది ఉగాది ఏప్రిల్ 9వ తేదీన చైత్ర మాస శుక్లపక్ష పాడ్యమి మంగళవారం రోజున ప్రజలు ఉగాది పండగను జరుపుకోనున్నారు. ఈ ఏడాది క్రోధి నామ సంవత్సరం. శ్రీ క్రోధి నామ సంవత్సరంతో కలియుగం ప్రారంభమై 5,125 ఏళ్లు అయ్యాయని పండితులు చెబుతున్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని వివరిస్తున్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలు కోపం, ఆవేశముతో వ్యహరిస్తారని అంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య క్రోధములు వంటివి కలగుతాయని.. దేశంలో రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు, క్రోధములు కలగడం, దేశాల మధ్య ఆగ్రహావేశాలు, యుద్ధ వాతావరణం వంటివి కలగడం వంటి సూచలు ఎక్కువగా ఉన్నాయని సిద్ధాంతులు చెబుతున్నారు. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమినాడు పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణంతోనే ఆ యోధాగ్రణి స్మ్రుత్యర్థం ఉగాది ఆచరిస్తారని చారిత్రక వ్రుత్తాంతం చెబుతోంది. శిశిర రుతువులో ఆకురాలుతుంది. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. చెట్లు చిగురిస్తాయి. ప్రకృతి అంతా కూడా శోభాయమానంగా మారుతుంది. కోయిలలు కుహు కుహూ అంటూ గానమెత్తుతాయి.
పూర్తిగా చదవండి..Ugadi 2024: క్రోధి నామ సంవత్సరం అంటే ఏంటి? ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?
ఈ సంవత్సరం ఉగాది నుంచి క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. అసలు ఈ క్రోధి నామ సంవత్సరం అంటే ఏమిటి?దాని అర్థం ఏంటి?ఈ ఏడాది ఎలాంటి పరిస్థితులు ఎదురువుతాయి. పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
Translate this News: