వర్షాకాలం కావడంతో సాధారణంగా సీజనల్ వ్యాధులు దరిచేరుతూ ఉంటాయి. అయితే కండ్లకలక వ్యాధి మాత్రం కాస్త భయపెడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కండ్లకలక గురించే మాట్లాడుకుంటున్నారు. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. అంటువ్యాధి కూడా కావడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. దీనిని ఐ ప్లూ, పింక్ ఐ అని వైద్యశాస్తంలో అంటారు. వర్షాకాలం సీజన్లో గాలిలో తేమ ఎక్కువగా ఉండే కారణంగా బ్యాక్టీరియా కళ్లను ప్రభావితం చేస్తుందని.. ఫలితంగా కండ్ల కలక బారిన పడుతుంటారని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా చిన్నారులు, విద్యార్థులు కండ్లకలక బారిన పడుతూ ఉంటారని పేర్కొన్నారు. అయితే పలు జాగ్రత్తలు తీసుకుంటే కండ్లకలక నుంచి రక్షించుకోవచ్చని వెల్లడిస్తున్నారు.
పూర్తిగా చదవండి..బీ అలర్ట్.. హడలెత్తిస్తున్న కండ్లకలక
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే కండ్లకలక కూడా ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కండ్లకలక గురించే చర్చ జరుగుతోంది. ఇది అంటువ్యాధి కావడంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Translate this News: