వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 290కి పైగా ప్రజలు చనిపోయారు. ప్రకృతి సృష్టించిన బీభత్సంలో రోడ్లు, ఇళ్లు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయి. ప్రమాదం జరిగిన కొన్ని గంట్లలోనే రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ బాధితులను కాపాడేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఓ వైపు మృతదేహాలను వెలికితీయడంతో పాటు మరో వైపు సహాయక చర్యలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ముందక్కై-చురాల్మల మధ్య 24 గంటల్లోనే బ్రిడ్జి నిర్మించి సంచలనం సృష్టించింది. ఈ బ్రిడ్జిపై ఆర్మీ వెహికిల్ తో ట్రయల్ రన్ ను సైతం నిర్వహించారు. ఇది సక్సెస్ కావడంతో భావోద్వేగానికి గురైన ఆర్మీ సిబ్బంది, స్థానికులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు.
ఇది కూడా చదవండి: Wayanad: వయనాడ్లో కనీవిని ఎరుగని రీతిలో విధ్వంసం.. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే..!
RTV Exclusive Video: 24 గంటల్లో వయనాడ్ లో బ్రిడ్జి నిర్మించిన ఆర్మీ
వయనాడ్ లో ఘోర విపత్తు బాధితులకు సాయం చేయడానికి ఆర్మీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ముందక్కై-చురాల్మల మధ్య 24 గంటల్లోపే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసింది. దీనిపై ట్రయల్ రన్ సైతం విజయవంతమైంది. ఆర్టీవీ ప్రతినిధి అందిస్తున్న ఎక్స్ క్లూజీవ్ దృశ్యాలు ఈ వీడియోలో చూడండి.
Translate this News: