/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/suicide-1-jpg.webp)
AP: తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ నగర్లో వాచ్మెన్ భార్య దారుణ హత్యకు గురయింది. దుండగులు ఇంట్లో చొరబడి ఆమె గొంతు కోసి హతమార్చారు. వ్యక్తిగత పనుల నిమిత్తం భర్త రామిరెడ్డి కడపకు వెళ్లినట్లు తెలుస్తోంది. అంధురాలైన కుమార్తెతో ఇంట్లో ఉన్న వాచ్మెన్ భార్యపై దుండగులు దాడి చేసి చంపారు. ఘటనపై సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.