గల్లీ క్రికెట్లో తరుచుగా జరిగే ఘటన ఒకటి ఉంటుంది. లైట్ ఫెయిల్యూర్ అవుతున్న సమయంలో బౌలింగ్ చేస్తున్న టీమ్ కావాలని టైమ్ వేస్ట్ చేస్తుంటుంది. పదేపదే వైడ్లు వేయడం.. కీపర్ కావాలని బాల్ వదిలేయడం.. ఎలాగో బైస్ రూల్ ఉండదు కదా.. అందుకే ఫీల్డర్ కూడా ఆ బంతి తీసుకురావడానికి చాలా టైమ్ తింటాడు. అక్కడ నుంచి బాల్ థ్రో చేయడం.. ఇదంతా సమయం వృధా చేసే టెక్నిక్స్.. ఇదే ఘటన ఓ కాంపిటేటివ్ క్రికెట్లో జరిగితే ఎలా ఉంటుంది.. ఎంత చీప్గా ఉంటుంది..? కానీ అదే జరిగిదంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. దులీప్ ట్రోఫి ఈ ఘటనకు వేదికైంది.
పూర్తిగా చదవండి..Sportsmanship Debate: అంతా తొండి… ఇలా కూడా చేస్తారా.. మండిపోతున్న క్రికెట్ అభిమానులు..!
దులీప్ ట్రోఫిలో నార్త్ జోన్, సౌత్ జోన్ మధ్య జరిగిన సెమీస్ పోరు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మ్యాచ్ని డ్రా చేసేందుకు నార్త్ జోన్ 5.3ఓవర్లను బౌలింగ్ చేయడానికి ఏకంగా 53నిమిషాలు టైమ్ తీసుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ 36.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని సొంతం చేసుకుంది.
Translate this News: