అవతల వాళ్ల కులంపై చిన్నచూపో.. తానే బలవంతుడినన్న అహంకారమో తెలియదు కానీ మధ్యప్రదేశ్లో జరిగిన అత్యంత అమానవీయ ఘటన సోషల్మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అసలు మనషులు ఇలా కూడా ఉంటారా అనిపించేలా.. రోజువారీ కూలీగా జీవనం సాగిస్తున్న ఓ గిరిజన యువకుడి ముఖంపై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రం పోయడంపై నెటిజన్లు మండిపడుతున్నార. సిగరెట్ తాగుతూ శుక్లా ఇలా చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కుబ్రికి చెందిన ప్రవేశ్ శుక్లా ఈ పని చేసినట్టు పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం శివ్రాజ్ సింగ్ చౌహాన్ సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రవేశ్ శుక్లాను అరెస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Shocker: అత్యంత అమానవీయం.. గిరిజన యువకుడి ముఖంపై మూత్రం..!
మధ్యప్రదేశ్లో అత్యంత అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఓ గిరిజన యువకుడి ముఖంపై కుబ్రికి చెందిన ప్రవేశ్ శుక్లా మూత్రం పోసిన వీడియో వైరల్గా మారింది. గిరిజనుడిపై బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన ఘగనపై సీఎం చౌహాన్ దృష్టి సారించారు. అతని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయగా..అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Translate this News: