/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/honduras-prisoners.jpg)
హోండురాస్ జైలులో హింసాత్మక ఘటన కలకలం రేపింది. మంగళవారం మహిళా జైలులో జరిగిన అల్లర్లలో 41 మంది ఖైదీలు సజీవదహనమైనట్లు వార్తలు వస్తున్నాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై రెండు ముఠాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రెండు గ్రూపులు దాడులకు పాల్పడుతూ జైలుకు నిప్పటించారు. ఈ హింసాకాండలో 41 మంది ఖైదీలు సజీవదహనమయ్యారు. హోండురాస్ జాతీయ పోలీసు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రతినిధి యూరి మోరా మాట్లాడుతూ, చాలా మంది ఖైదీలు సజీవదహనమైనట్లు తెలిపారు. హోండురాస్ రాజధాని తెగుసిగల్పాకు వాయువ్యంగా 30 మైళ్ల దూరంలో ఉన్న తమరాలోని జైలులో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
మీడియా నివేదికల ప్రకారం, ఏడుగురు మహిళా ఖైదీలు కత్తిపోట్లకు గురయ్యారని..వారు ప్రస్తుతం తెగుసిగల్పాలోని ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నట్లు పేర్కొన్నాయి. జైళ్లలో అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు అధికారులు ఇటీవల చేసిన ప్రయత్నాల వల్ల అల్లర్లు చెలరేగాయని ఆ దేశ జైలు వ్యవస్థ అధిపతి జూలిసా విల్లానువా తెలిపారు. దీంతో మంగళవారం జైలులో హింస చెలరేగినట్లు చెప్పారు. జైళ్లలో అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాలు తమ నియంత్రణను విస్తృతంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. US మీడియా ప్రకారం, హోండురాస్ జాతీయ మహిళా జైలులో దాదాపు 800 మంది ఖైదీలు ఉన్నారు. జైలు సామర్థ్యం రెట్టింపు కంటే ఎక్కువ మంది ఖైదీలు ఇందులో ఉన్నారు. 2020లోనూ హోండురాస్ జైలులో అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి.
📝🇭🇳At least 41 people dead leave a confrontation in a women's prison in Honduras
— 🌐World News 24 🌍🌎🌏 (@DailyWorld24) June 20, 2023
According to Honduran authorities, imprisoned organized crime leaders order extortion, kidnapping and other crimes from inside prisons.
A confrontation between gang members left at least 41 dead… pic.twitter.com/kRg8o9aYSx