హోండురాస్ జైలులో హింసాత్మక ఘటన కలకలం రేపింది. మంగళవారం మహిళా జైలులో జరిగిన అల్లర్లలో 41 మంది ఖైదీలు సజీవదహనమైనట్లు వార్తలు వస్తున్నాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై రెండు ముఠాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రెండు గ్రూపులు దాడులకు పాల్పడుతూ జైలుకు నిప్పటించారు. ఈ హింసాకాండలో 41 మంది ఖైదీలు సజీవదహనమయ్యారు. హోండురాస్ జాతీయ పోలీసు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రతినిధి యూరి మోరా మాట్లాడుతూ, చాలా మంది ఖైదీలు సజీవదహనమైనట్లు తెలిపారు. హోండురాస్ రాజధాని తెగుసిగల్పాకు వాయువ్యంగా 30 మైళ్ల దూరంలో ఉన్న తమరాలోని జైలులో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..మహిళా జైలులో హింసాకాండ… 41 మంది ఖైదీలు సజీవదహనం..!!
అమెరికాలో దారుణ ఘటన జరిగింది. హోండురాస్ లోని మహిళ జైలులో రెండు ముఠాల మధ్య హింస చోటుచేసుకుంది. ఈ హింసాకాండలో 41 మంది ఖైదీలు సజీవదహనమయ్యారు. హోండురాస్ రాజధాని తెగుసిగల్పాకు వాయువ్యంగా 30మైళ్ల దూరంలో ఉన్న తమరాలోని జైలులో ఈ ఘటన జరిగినట్లు హోండురాస్ జాతీయ పోలీసు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తెలిపింది.
Translate this News: