Congress : నేడు కాంగ్రెస్లోకి వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియా వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ రెజ్లర్లు పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ రాహుల్ గాంధీని కలిసిన విషయం తెలిసిందే. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 06 Sep 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Vinesh Phogat : మరి కొన్ని రోజుల్లో జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir) తో సహా హర్యానా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ రెజ్లర్లు పార్టీలో చేరనున్నట్లు సమాచారం. వారికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన విషయం తెలిసిందే. కాగా వారు మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో హర్యానా నుంచి కాంగ్రెస్ పరి తరఫున ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. వీరి చేరికతో కాంగ్రెస్ కు రాజకీయంగా మైలేజ్ పెరగనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని 90 మంది సభ్యుల శాసనసభకు అక్టోబర్ 5న ఓటింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 12, ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8న జరుగుతుంది. Also Read : సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదు #vinesh-phogat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి