నిత్యం ఆటాపాటలతో ఎంతో ఆనందంగా గడిపే కుటుంబం వాళ్లది. హాలీడే దొరికితే చాలు.. ఏదో ఒక పిక్నిక్ స్పాట్లో వాలిపోయే ఫ్యామిలీ వారిది. అయితే అదే పిక్నిక్ సరదా తమ బతుకుల్లో తీవ్ర విషాదాన్ని నింపుతుందని ఊహించలేకపోయారు. ఫొటోల పిచ్చి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. బీచ్లో అలల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో సముద్రంలో కొట్టుకుపోయి ఓ మహిళ మృతి చెందిన ఘటన ముంబైలో జరిగింది.
పూర్తిగా చదవండి..Video: ఫొటోలకు ఫోజులు.. బీచ్లో కొట్టుకుపోయిన మహిళ..వైరల్ వీడియో..!
ముంబై బాంద్రాలోని బ్యాండ్స్టాండ్లో 32 ఏళ్ల జ్యోతి సోనార్ అనే మహిళ భారీ అలలకు బలైపోయింది. ఫొటోల కోసం సముద్రంలోని ఓ బండపై కూర్చున్న జ్యోతి, ఆమె భర్త ముఖేశ్పైకి అలలు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. ముఖేశ్ని స్థానికులు కాపాడగా.. జ్యోతి మాత్రం అలల్లో కొట్టుకుపోయి చనిపోయింది.
Translate this News: