Vetapalem: బీచ్‌లో ఘోర విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి!

ఏపీలోని రామాపురం బీచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏలూరుకు చెందిన నలుగురు విద్యార్థులు నీటిలో గల్లంతై మృతి చెందారు. మృతులను నితిన్, కిషోర్, తేజ, అమలరాజ్‌గా గుర్తించారు. మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు.

Vetapalem: బీచ్‌లో ఘోర విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి!
New Update

AP: ఏపీలోని వేటపాలెం రామాపురం బీచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగ ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థుల గల్లంతు అవగా నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వారిద్దరూ కూడా మరణించినట్లు మత్యకారులు చెబుతుండగా.. మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు సహాయక సిబ్బంది వెల్లడించింది. మృతులను నితిన్, కిషోర్, తేజ, అమలరాజ్‌గా గుర్తించారు.

ఈ మేరకు స్థానికులు వివరాల ప్రకారం.. అలల తాకిడికి ఒక్కసారిగా నలుగురు విద్యార్థులు కొట్టుకుపోయినట్లు తెలిపారు. సహాయం కోసం కేకలు వేసిన ఉపయోగం లేకపోయిందని, వారిని ఏలూరు నుంచి వచ్చిన 11 మంది విద్యార్థులుగా గుర్తించారు. వారితోపాటు వచ్చిన స్నేహితులు శోకసంద్రంలో మునిగితేలారు. మృతుల బంధువులకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు వేటపాలెం పోలీసులు తెలిపారు.

#ramapuram-beach
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి