/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/tdp-central-ministers-.jpg)
తెలుగుదేశం నుంచి మొత్తం 16 మంది ఎంపీలుగా విజయం సాధించడంతో కేంద్రంలో కీలకంగా మారింది ఆ పార్టీ. దీంతో ఆ పార్టీకి భారీగా కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయం సాధించిన 16 మందిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఎంపీల్లో కొత్త వారు ఎక్కువగా ఉండడంతో ఎవరికి కేంద్రమంత్రి పదవి వస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. వరుసగా 3సార్లు గెలిచిన రామ్మోహన్ నాయుడుకి పక్కాగా కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు అవకాశం ఖాయమని తెలుస్తోంది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి సైతం కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.