• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • నిజామాబాద్
  • విజయవాడ
  • వైజాగ్
Home » ఉత్తరాఖండ్‎లో ఘోరప్రమాదం, లోయలో పడిన జీప్, 9మంది దుర్మరణం..!!

ఉత్తరాఖండ్‎లో ఘోరప్రమాదం, లోయలో పడిన జీప్, 9మంది దుర్మరణం..!!

Published on June 22, 2023 1:49 pm by Bhoomi

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పితోర్‎గఢ్‎లో జీపు 600 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. హోక్రా ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జీపులో మొత్తం పదిమంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు.

Translate this News:

ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పితోర్‌గఢ్ జిల్లా మున్సియరీ బ్లాక్‌లోని బాగేశ్వర్‌లోని సామా నుంచి హోక్రా ఆలయానికి వెళ్తున్న జీపు రోడ్డుపై నుంచి అదుపుతప్పి రామగంగా నదిలో పడిపోయింది. వాహనంలో ఉన్న పది మందిలో తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన విషయాన్ని అటుగా వెళ్తున్న ఇతర డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఇతర డ్రైవర్ల సమాచారంతో పోలీసులతోపాటు రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. జీప్ 600 మీటర్ల కంటే ఎక్కువ లోతైన లోయలో పడటంతో సహాయక చర్యలు చాలా ఆటంకం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.

uttarakhand accident

 

 

ఈ ఘోర ప్రమాదంపై ఎమ్మెల్యే హరీష్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా మెజిస్ట్రేట్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి..సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు. ప్రమాదంపై ముఖ్యమంత్రితో మాట్లాడి మృతుల కుటుంబాలకు పరిహారం అందజేలా చూస్తామని తెలిపారు. అటు పితోర్‌గఢ్‌లో జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ధామి ఆకాంక్షించారు.

बागेश्वर के शामा से पिथौरागढ़ के नाचनी की ओर आ रहे वाहन के दुर्घटनाग्रस्त हो जाने से कई लोगों के हताहत होने का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ है।

घटनास्थल पर राहत एवं बचाव कार्य हेतु रेस्क्यू टीम रवाना कर दी गई है। ईश्वर से दिवंगत आत्माओं को शांति प्रदान करने की कामना करता हूँ।…

— Pushkar Singh Dhami (@pushkardhami) June 22, 2023

Primary Sidebar

Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త

Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త

Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేష్ భేటీ

Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేష్ భేటీ

waheeda, dada saheb award

movies:ఏరువాక సాగారో నటి వహీదా రహమాన్ కు దాదా సాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం

lawrence met rajini

movies:రజనీ కాళ్ళు మొక్కిన లారెన్స్ రాఘవ

aleru mla sunitha

Big Breaking: ఆలేరు ఎమ్మెల్యే సునీతకు హైకోర్టు షాక్

niharika in USA

Niharika:అమెరికా వీధుల్లో మెగా అమ్మాయి గ్లామర్ షో

Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu :నాల్గవవారం నామినేషన్స్ లో రచ్చ…శివాజీ ఓవర్ యాక్షన్

manipur riots

Manipur: మణిపూర్లో మరో దారుణం వెలుగులోకి…

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online