ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. పితోర్గఢ్ జిల్లా మున్సియరీ బ్లాక్లోని బాగేశ్వర్లోని సామా నుంచి హోక్రా ఆలయానికి వెళ్తున్న జీపు రోడ్డుపై నుంచి అదుపుతప్పి రామగంగా నదిలో పడిపోయింది. వాహనంలో ఉన్న పది మందిలో తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన విషయాన్ని అటుగా వెళ్తున్న ఇతర డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఇతర డ్రైవర్ల సమాచారంతో పోలీసులతోపాటు రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. జీప్ 600 మీటర్ల కంటే ఎక్కువ లోతైన లోయలో పడటంతో సహాయక చర్యలు చాలా ఆటంకం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.
పూర్తిగా చదవండి..ఉత్తరాఖండ్లో ఘోరప్రమాదం, లోయలో పడిన జీప్, 9మంది దుర్మరణం..!!
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. పితోర్గఢ్లో జీపు 600 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. హోక్రా ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జీపులో మొత్తం పదిమంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు.
Translate this News: