ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. పితోర్గఢ్ జిల్లా మున్సియరీ బ్లాక్లోని బాగేశ్వర్లోని సామా నుంచి హోక్రా ఆలయానికి వెళ్తున్న జీపు రోడ్డుపై నుంచి అదుపుతప్పి రామగంగా నదిలో పడిపోయింది. వాహనంలో ఉన్న పది మందిలో తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన విషయాన్ని అటుగా వెళ్తున్న ఇతర డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఇతర డ్రైవర్ల సమాచారంతో పోలీసులతోపాటు రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. జీప్ 600 మీటర్ల కంటే ఎక్కువ లోతైన లోయలో పడటంతో సహాయక చర్యలు చాలా ఆటంకం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘోర ప్రమాదంపై ఎమ్మెల్యే హరీష్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా మెజిస్ట్రేట్తోపాటు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి..సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు. ప్రమాదంపై ముఖ్యమంత్రితో మాట్లాడి మృతుల కుటుంబాలకు పరిహారం అందజేలా చూస్తామని తెలిపారు. అటు పితోర్గఢ్లో జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ధామి ఆకాంక్షించారు.
बागेश्वर के शामा से पिथौरागढ़ के नाचनी की ओर आ रहे वाहन के दुर्घटनाग्रस्त हो जाने से कई लोगों के हताहत होने का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ है।
घटनास्थल पर राहत एवं बचाव कार्य हेतु रेस्क्यू टीम रवाना कर दी गई है। ईश्वर से दिवंगत आत्माओं को शांति प्रदान करने की कामना करता हूँ।…
— Pushkar Singh Dhami (@pushkardhami) June 22, 2023