Uttar Pradesh: రారమ్మని పిలిచింది.. గొడవపడి అతని మర్మాంగాన్ని కోసేసింది..!

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొరుగింటి వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది ఓ మహిళ. తనపై లైంగిక దాడికి యత్నించాడని మహిళ ఆరోపిస్తుంటే.. ఆమెనే పిలిచిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Uttar Pradesh: రారమ్మని పిలిచింది.. గొడవపడి అతని మర్మాంగాన్ని కోసేసింది..!
New Update

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలోని షరీఫ్‌పూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని ఇంటికి పిలిచి మరీ అతని జననాంగాలను కోసేసింది మహిళ. బాధిత వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఆ మహిళ.. సదరు వ్యక్తిపై దాడి ఎందుకు చేసింది? అంత కోపం ఎందుకు? అసలేం జరిగింది? పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

షరీఫ్‌పూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ(32) ఒంటరిగా జీవిస్తోంది. ఆమె భర్త ఉపాధి నిమిత్తం యూఏఈలో ఉన్నాడు. అయితే, తాజాగా మహిళ తన ఇంట్లో ఓ వ్యక్తితో గొడవ పడి అతని మర్మాంగాన్ని కత్తితో కోసేసింది. దాంతో ఆ వ్యక్తి రక్తపు మడుగులో పడి విలవిల్లాడాడు. అతని అరుపులు, కేకలు విని.. పొరుగింట్లోనే ఉన్న అతని కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే అతని వద్దకు చేరుకుని.. ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించగా.. వారు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై మంజన్‌పూర్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 326, 308 కింద కేసు నమోదు చేశారు. మహిళే తనను పిలిచిందని బాధితుడు ఆరోపిస్తుండగా.. సదరు వ్యక్తి తనపై లైంగిక దాడికి యత్నించాడని, అందుకే ఆత్మరక్షణలో భాగంగా ఈ చర్యకు పాల్పడినట్లు మహిళ చెబుతోంది. మొత్తంగా ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించగా.. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం

యాక్సిస్ బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్ కు ఆర్బీఐ షాక్!

#illegal-relationship #intimacy #uttar-pradesh-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe