ఓ వైపు ఎన్నికలు సమీపిస్తుంటే.. మరోవైపు వివిధ పార్టీల కీలక నేతల పార్టీ మార్పులపై ప్రచారాలు కూడా జోరందుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి నేతలు చేరుతున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రత్యర్థులను చెక్ పెట్టేందుకు గెలుపు గుర్రాలను, కలిసి వచ్చే నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
పూర్తిగా చదవండి..ఉత్తమ్ పార్టీ మార్పు పై మళ్లీ జోరుగా ప్రచారం..ఉద్దేశపూర్వకంగానే!!
కాంగ్రెస్ ఎంపీ, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మార్పుపై జోరుగా ఊహాగానాలు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ గూటికి చేరుతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై రియాక్ట్ అయిన ఉత్తమ్ అవన్నీ అవాస్తవాలని కొట్టి పారేశారు. కావాలని ఉద్దేశపూర్వకంగా పార్టీలోని వారే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ మండిపడుతున్నారు.
Translate this News: