UPSC chairman: నకిలీ ఐఏఎస్ వ్యవహారం.. యూపీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామా!

యూపీఎస్సీ ఛైర్మన్‌ పదవికి మనోజ్‌ సోనీ రాజీనామా చేసినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్‌ నెలలోనే బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఇంకా ఐదేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేయడం గమనార్హం.

New Update
UPSC chairman: నకిలీ ఐఏఎస్ వ్యవహారం.. యూపీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామా!

UPSC chairman Manoj Soni:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఛైర్మన్ మనోజ్ సోనీ తన పదవీ కాలం ముగియడానికి ఐదేళ్ల ముందు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే పదవి నుంచి వైదొలగుతున్నట్లు సోనీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మనోజ్ సోనీ దాదాపు పదిహేను రోజుల క్రితం ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కాగా ఆయన రాజీనామాను ఉన్నతాధికారులు ఇంకా ఆమోదించలేదని సమాచారం.

ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చుట్టూ ఉన్న వివాదాలు.. ఆరోపణలతో రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలవల్లే తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు సోనీ UPSC చైర్మన్‌గా మే 16, 2023న ప్రమాణ స్వీకారం చేశారు. అతని పదవీకాలం మే 15, 2029తో ముగియనుంది.

Also Read : ఈడీ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్




Advertisment
తాజా కథనాలు