Upcoming Smartphones 2024 : త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ పై ఓ లుక్కెయ్యండి.!

కొద్ది నెలల్లో భారతదేశంలో చాలా స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. కస్టమర్‌లు ఎదురుచూస్తున్న అలాంటి 5 ఫోన్‌ల జాబితాలో గూగుల్ పిక్సెల్ 8ఏ, శాంసంగ్ గెలాక్సీ ఎం55, వన్ ప్లస్ నార్డ్ సీఈ4 వంటి స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

New Update
Upcoming Smartphones 2024 : త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ  టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ పై ఓ లుక్కెయ్యండి.!

Smartphones 2024 : స్మార్ట్‌ఫోన్ కంపెనీలు(Smartphone Companies).. కస్టమర్ల అభిరుచి మేరకు సరికొత్త డివైసులను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. చాలా కంపెనీలు తమ కస్టమర్లను కొత్త ఆవిష్కరణలు, సరికొత్త సాంకేతికతతో కనెక్ట్ చేయాలనుకుంటున్నాయి. ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ కొన్ని నెలల్లో కంపెనీలు సరికొత్త ఫోన్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.శాంసంగ్, వన్ ప్లస్, గూగుల్ వంటి కంపెనీలు తమ కొత్త ఫోన్‌లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అలాంటి 5 రాబోయే ఫోన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబితాలో Google Pixel 8a, Samsung Galaxy M55, OnePlus Nord CE 4, Realme GT 5 Pro వంటి అనేక స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.

రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు Galaxy M55, OnePlus Nord CE 4 వంటి పరికరాలు మిడిల్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు. Pixel 8a Google తాజా హార్డ్‌వేర్ తక్కువ ధరలో బెస్ట్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని కోరుకునే వారి కోసం అందుబాటులోకి రానున్నాయి. Realme GT 5 Pro వినియోగదారుల కోసం, హై-ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురానుంది.

గూగుల్ పిక్సెల్ 8ఏ:
గూగుల్ తన కొత్త ఫోన్‌ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. Pixel 8a లాంచ్ తేదీ గురించి కంపెనీ ఇంకా వెల్లడించనప్పటికీ.. మే 14న జరగబోయే డెవలపర్స్ కాన్ఫరెన్స్(Google I/O 2024) లో కంపెనీ దానిని ప్రకటించవచ్చని భావిస్తున్నారు.ఇది కంపెనీ తాజా పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్ టోన్-డౌన్ వెర్షన్. దీనిలో మీరు టెన్సర్ G3 ప్రాసెసర్‌తో Google AI ఫీచర్లు బెస్ట్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని పొందుతారు.గూగుల్ పిక్సెల్ 8ఏ ధర భారతదేశంలో దాదాపు రూ. 50,000 ఉండవచ్చు.

మోటో ఎడ్జ్ 50 ప్రో:
ఇది కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఫోన్. దీని లాంచ్ తేదీ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఫోన్ ఏప్రిల్ 3న భారతదేశంలో లాంచ్ కానుంది.ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్, మెటల్ ఫ్రేమ్ ఉంటుంది.8K వీడియో రికార్డింగ్ మద్దతుతో 50MP సెన్సార్‌తో స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పొందుతుంది. ఈ ఫోన్ 125W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీని పొందవచ్చు.

వన్ ప్లస్ నార్డ్ సీఈ4:
OnePlus తన సరికొత్త Nord స్మార్ట్‌ఫోన్ అంటే OnePlus Nord CE4ని ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేస్తోంది. Nord CE 4 స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌ని కలిగి ఉంది, గరిష్టంగా 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం 55:
శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎం55ను..గెలాక్సీ ఏ35, ఏ55 ఫోన్లను లాంఛ్ చేసిన తరువాత, దీనిని రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీనిని గెలాక్సీ ఏ55ను ఇన్​స్పిరేషన్​గా తీసుకుని డిజైన్ చేశారు. ఈ గెలాక్సీ ఎం55 అనేది ప్లాస్టిక్ ఫ్రేమోతో రానుంది. ఈ ఫోన్​లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 ఎంపీ లేదా 60 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉండే ఛాన్స్ ఉంది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.30,000 వరకు ఉండే అవకాశం ఉంది.

రియల్​మీ GT 5 Pro :
రియల్​మీ త్వరలోనే జీటీ 5 ప్రో ఫోన్​ను లాంఛ్ చేయనుంది. ఈ అప్​కమింగ్ ఫోన్​లో ఐకూ 12, వన్​ప్లస్​ 12లో ఉన్న స్పెసిఫికేషన్లే ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ గత నెలలోనే చైనాలో రిలీజ్​ అయ్యింది.ఈ ఫోన్ లో 5,400mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్​ ఫాస్ట్ ఛార్చింగ్, 50వాట్​ వైర్​లెస్​ ఛార్జింగ్ సపోర్టు ఉంటుంది. దీని ధర గురించి ఇంకా వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి : ఐపీఎల్‎లో ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డ్..!

Advertisment
తాజా కథనాలు