UP Gangrape: యూపీలో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్

యూపీలో దారుణం జరిగింది. ఓ డిగ్రీ విద్యార్థినిపై తమ పైశాచికత్వం ప్రదర్శించారు నలుగురు దుండగులు. కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డుపై విసిరేసి వెళ్లిపోయారు. బులంద్‌షహర్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది

UP Gangrape: యూపీలో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్
New Update

UP Gangrape: యూపీలో దారుణం జరిగింది. ఓ డిగ్రీ విద్యార్థినిపై తమ పైశాచికత్వం ప్రదర్శించారు నలుగురు దుండగులు. కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డుపై విసిరేసి వెళ్లిపోయారు. బులంద్‌షహర్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. బాధితురాలు స్థానికంగా ఉన్న కాలేజ్‌లో B.A. చదువుతోంది. సెప్టెంబర్‌ 1న కాలేజ్‌ నుంచి తిరిగొస్తుండగా.. లిఫ్ట్‌ ఇస్తాననే సాకుతో మాయమాటలు చెప్పి బైక్‌ ఎక్కించుకున్నాడు ఆమె ఫ్రెండ్‌. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్లాక మరో ముగ్గురితో కలిసి కారులో ఎక్కించుకొని ఔరంగాబాద్‌ వైపు తీసుకెళ్లారు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపిచ్చి ఆమె ఫ్రెండ్‌తో పాటు ఆ ముగ్గురు కారులోనే సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.

త్వరలోనే నిందితులను పట్టుకుంటాం..

అటుగా వెళ్తున్న స్థానికులు బాధితురాలిని గమనించి ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. అమర్‌ఘర్‌ చౌకీ గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడి తండ్రి, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు.ఘటన జరిగిన రోజు నుంచి పరారీలో ఉన్నాడు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు పోలీసులు. ఈ దారుణ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

క్రిమినల్స్ అడ్డాగా యూపీ.. 

కాగా ఇటీవల యూపీలో కేంద్రమంత్రి ఇంట్లో ఓ యువకుడి కాల్చివేత ఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. యూపీ క్రిమినల్స్‌కు అడ్డాగా మార్చారంటూ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు తన కుమారుడి హత్య కేసును.. సీబీఐతో విచారణ జరిపించాలని మృతుని కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. లక్నో బెగారియా రోడ్డులో ఉన్న కేంద్రమంత్రి కౌశల్‌ కిషోర్‌ ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన సమయంలో అక్కడ మొత్తం ఆరుగురు ఉన్నారు. మంత్రి కుమారుడు వికాస్‌ కిషోర్‌ ఫ్రెండ్స్‌ పార్టీ చేసుకున్నారు. అర్థరాత్రి వరకు మద్యం తాగుతూ పేకాట ఆడారు. అయితే పేకాటలో రూ.12వేల విషయంలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ.. కాల్పులకు దారి తీసింది. మంత్రి కుమారుడి లైసెన్స్‌డ్‌ గన్‌తో.. వినయ్‌ అనే యువకుడిపై కాల్పులు జరిపాడు అంకిత్‌. ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు వినయ్‌.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి