కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ తన ప్రకటనల కారణంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిగ్గా మారాయి. కాంగ్రెస్లో చేరమని ఒక నాయకుడు తనకు సలహా ఇచ్చారని, ఆ పార్టీ సభ్యత్వం కంటే బావిలో దూకేస్తానని బదులిచ్చానని చెప్పారు. 60 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో చేసిన పనుల కంటే గత తొమ్మిదేళ్లలో మోదీ నాయకత్వంలోని బీజేపీ రెట్టింపు పనులు చేసిందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం మహారాష్ట్రలోని భండారాలో జరిగిన సభలో నితిన్ గడ్కరీ బీజేపీలో తన తొలి రోజులను గుర్తుచేసుకున్నారు.బీజేపీతో ఇప్పటివరకు పార్టీ ప్రయాణం గురించి మాట్లాడారు.
పూర్తిగా చదవండి..బావిలో దూకమంటే దూకుతాను..కానీ కాంగ్రెస్లో చేరను..!!
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను కాంగ్రెస్ లో చేరమని ఆపార్టీకి చెందిన ఓ నాయకుడు సలహా ఇచ్చారని చెప్పారు. బావిలో దూకమంటే దూకుతాను కానీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం మాత్రం తీసుకోనని తాను బదులిచ్చినట్లు చెప్పారు. మోదీ హయాంలో బీజేపీ 9ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మహారాష్ట్రలోని భండారిలో జరిగిన సభలో నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Translate this News: