కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి శనివారం గుజరాత్లోని కచ్లో బిపార్జోయ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం సీఎం భూపేంద్ర పటేల్, ఇతర ఉన్నతాధికారులతో అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాండ్విని సందర్శించి తుపాను కారణంగా ప్రభావితమైన ప్రజలను కలుసుకున్నారు. ఏరియల్ రివ్యూ అనంతరం హోంమంత్రి అమిత్ షా SDRF, NDRF సిబ్బందితో సమావేశమయ్యారు. బిపార్జోయ్ తుపాను సమయంలో, ప్రజలను రక్షించడానికి బృందం తీవ్రంగా ప్రయత్నించిందని ఈ విధ్వంసం సమయంలో రెస్క్యూ టీం చురుగ్గా పనిచేసిందని అభినందించారు.
Gujarat | Union Home Minister Amit Shah visited Mandvi Civil Hospital and met the people admitted there. pic.twitter.com/JLVbovreQd
— ANI (@ANI) June 17, 2023
ఇక వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారిందని, రానున్న 12 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం తెలిపింది. IMD ప్రకారం, ఆగ్నేయ పాకిస్తాన్పై తుపాను శుక్రవారం రాత్రి 11:30 గంటలకు బలహీనపడింది. ఇది నైరుతి రాజస్థాన్, కచ్ మీదుగా ధోలావీరాకు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో బలహీనపడిందని ఐఎండీ ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా, తుపాను ప్రభావంతో కచ్లోని భుజ్లో పలు చెట్లు నేలకూలడంతో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) బృందం శుక్రవారం సహాయక చర్యలు చేపట్టింది. గురువారం సాయంత్రం బిపార్జోయ్ తుపాను రాష్ట్ర తీర ప్రాంతాలను తాకడంతో మొత్తం ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రూపన్ బందర్ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
HM Shri @AmitShah ji tapping the back of our @NDRFHQ team for their valuable work during #CycloneBiporjoy. pic.twitter.com/kR2esgDS0o
— Harsh Sanghavi (@sanghaviharsh) June 17, 2023