కేంద్రమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం మంత్రి మండలి సమావేశం జరగనుంది. అంతకుముందు అధికార బీజేపీ అగ్రనేతల పలు సమావేశాలతో సమావేశం అయ్యారు. అజిత్ పవార్ శిబిరంలో చేరిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) రెబల్ ప్రఫుల్ పటేల్లకు కేంద్రంలో మంత్రులుగా పదవులు దక్కుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెప్టెంబరులో జి20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న ప్రగతి మైదాన్లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో మంత్రుల మండలి సమావేశం జరగనుంది.
కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు:
ఆదివారం మహారాష్ట్ర రాజకీయాలలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు.. హోం మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాతో సహా పార్టీ అగ్ర నేతల తరచుగా సమావేశాలు నిర్వహించడం.. కేంద్ర మంత్రివర్గంలో త్వరితగతిన పునర్వ్యవస్థీకరణ జరగవచ్చనే ఊహాగానాలకు ఆజ్యం పోశాయి . జూన్ 28న అమిత్ షా, నడ్డాతో మోడీ సమావేశమయ్యారు. సంస్థాగత, రాజకీయ పరిస్థితులను సమీక్షించడానికి అమిత్ షా, నడ్డా ఇప్పటికే ఇతర నాయకులతో సమావేశాలు నిర్వహించారు.
ఫడ్నవీస్, అజిత్లకు మంత్రివర్గంలో ఛాన్స్:
శరద్ పవార్ను విడిచిపెట్టి తన మేనల్లుడు అజిత్ పవార్తో చేతులు కలిపిన ఎన్సిపి ఎంపి, మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ మంత్రి పదవి గ్యారెంటీ అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మోడీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించుకున్నప్పుడల్లా మిత్రపక్షాలకు ప్రాతినిధ్యం కల్పిస్తారని బిజెపి నాయకులు భావిస్తున్నారు.
ఎన్నికల దృష్ట్యా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ:
జులై 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశానికి ముందు.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు చివరి అవకాశం అని కూడా ప్రచారం జరుగుతోంది. కేబినెట్లో ఎలాంటి పునర్వ్యవస్థీకరణ జరిగినా అది వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనా ప్రభావం చూపుతుంది. ఈ ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల్లో ఎన్నికలకు బీజేపీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. మరోవైపు కర్నాటకలో ఘనవిజయం తర్వాత కాంగ్రెస్ జోరు పెరిగినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీలు ప్రధానంగా ముఖాముఖి తలపడనున్నాయి.